Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శుక్రవారం రిలీజ్ లు: ఏ సినిమా ఎలా ఉంది?
హైదరాబాద్: స్టార్ హీరోల సినిమాల సందడి తగ్గడంతో మొన్న శుక్ర వారం మూడు చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 'దిక్కులు చూడకు రామయ్య', 'రోమియో', 'పాఠశాల' చిత్రాలు విడుదలయ్యాయి. మూడింటిలో రోమియో చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా, 'దిక్కులు చూడకు రామయ్య', 'పాఠశాల' ఓకే అనిపించుకున్నాయి.
నాగశౌర్య, సన మక్బూల్, అజయ్, ఇంద్రజ ప్రధానపాత్రల్లో రూపొందించిన 'దిక్కులు చూడకు రామయ్య' చిత్రాన్ని వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించారు. త్రికోటి దర్శకత్వం వహించగా... ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంపై టాలీవుడ్లో మంచి అంచనాలున్నాయి. అయితే అంచనాలను అందుకోలేకపోయిందీ చిత్రం. కానీ ఫస్టాఫ్ కామెడీ పండటం, విభిన్న కధాంశం కావటంతో కలెక్షన్స్ బాగానే ఉన్నాయి.
నందు, శివ, శంశాక్, అనుప్రియ, శిరీష, సాయికిరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'పాఠశాల'. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ మహంకాళి, పవన్కుమార్రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి టాక్ ఫరవాలేదనిపించినా కలెక్షన్స్ మాత్రం డల్ గా ఉన్నాయని తెలుస్తోంది. యూత్ కు కనెక్టు అయ్యేలా ప్రమోషన్ చేస్తే కలెక్షన్స్ ఊపందుకునే అవకాసం ఉందంటున్నారు.
పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్, అడోనికా జంటగా తెరకెక్కిన చిత్రం 'రోమియో'. గోపీ గణేష్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి కథ, మాటలు అందించడం విశేషం. అయితే ఈ చిత్రం మార్నింగ్ షోకే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవటంతో కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి.