Don't Miss!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
టెన్త్ ఎగ్జామ్స్ కి 'సన్నాఫ్ సత్యమూర్తి' కి లింక్
హైదరాబాద్ : ఇప్పటికే పోస్టర్స్ ద్వారా, ట్రైలర్ ద్వారా ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించిన సన్నాఫ్ సత్యమూర్తి, విడుదలకు ముందే సంచనాలను నమోదు చేస్తోంది. అయితే విడుదల తేదీ పై రకరకాల సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. అయితే రకరకాల ఆప్షన్స్ పరిశీలించిన సత్యమూర్తి యూనిట్...ఈ భారీ చిత్రాన్ని ఏప్రియల్ 9,2015న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన పనుల్లో ఉన్న ఈ సినిమాకు ప్రమోషన్ ని సైతం మరింత పెంచనున్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ తేదీ నిర్ణయించుకోవటానికి కారణం...సాయిధరమ్ తేజ తాజా చిత్రం రేయ్ కు ఈ సినిమాకు తగినంత గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకోవటం. టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రియల్ 8 తో అయిపోవటమే నని తెలుస్తోంది.
అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. సమంతా, నిత్యామీనన్, ఆదాశర్మ కథానాయికలు. కన్నడ హీరో ఉపేంద్ర, స్నేహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విరాజ్ ఆనంద్(అల్లు అర్జున్) సన్నాఫ్ సత్యమూర్తి. విలువలే అతని ఆస్తి. తన తండ్రి సత్యమూర్తి గౌరవాన్ని కాపాడటం కోసం విరాజ్ ఆనంద్ ఏం చేశాడన్నదే ఈ చిత్ర కథ.
అత్తారింటికి దారేది' లాంటి బ్లాక్బస్టర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో, ‘రేసుగుర్రం' లాంటి సూపర్ హిట్తో జోరు మీదున్న అల్లు అర్జున్ నటించిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి వస్తూండటంతో బిజినెస్ వర్గాల్లోనూ క్రేజ్ ఉంది. దానికి తోడు ఇప్పటికే విడుదలైన పాటలన్నీ కూడా హిట్గా నిలిచాయి.
మరోప్రక్క జులాయి సినిమాకు చేసినట్టుగానే సన్నాఫ్ సత్యమూర్తికి కూడా ఓ ప్రమోషన్ పాటను తెరకెక్కించే ఆలోచన చేస్తోంది సినిమా యూనిట్. జులాయి సినిమాలోని ‘పకడో పకడో' అన్న పాటకు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, హీరో అల్లు అర్జున్లపై ఓ ప్రమోషన్ పాటను తెరకెక్కించారు త్రివిక్రమ్. ఆ ప్లాన్ అప్పట్లో బాగా వర్కవుట్ అయింది. సినిమాని ప్రేక్షకుడికి చేర్చడంలో ఆ పాట కొంత ఉపయోగపడింది. ఇక సన్నాఫ్ సత్యమూర్తికి కూడా ఇలాగే చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
''నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో ఓ మంచి సినిమా తీశాం. అడగ్గానే ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకొన్న ఉపేంద్రగారికి ధన్యవాదాలు'' అన్నారు త్రివిక్రమ్.
అల్లు అర్జున్ మాట్లాడుతూ ''ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. కంటెంట్ ఉన్నవాడికి కటౌట్తో పనిలేదు.. అని హరీష్ శంకర్ ఓ డైలాగ్ రాశాడు. త్రివిక్రమ్ గారిని చూస్తే అదే గుర్తొస్తుంది. మేటర్ ఉన్నవాడికి మ్యాజిక్తో పని లేదు. ఈ సినిమాలోనూ మంచి సంభాషణలున్నాయ''న్నారు.
సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.