Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పవన్ పై గౌరవంతోనే ... బన్నీ వెనక్కి తగ్గాడు
హైదరాబాద్: ఈ మధ్యకాలంలో ఫిల్మ్ సర్కిల్స్లో ఎక్కువ చర్చగా మారిన అంశం...భాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్, బన్నీ ఒకే రోజు పోటి పడబోతున్నారని. పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం, అల్లు అర్జున్ ..సరైనోడు చిత్రం ..రెండూ ఏప్రియల్ 8న విడుదల తేదీలు ఫిక్స్ చేయటంతో ఈ టాపిక్ వచ్చింది.
అయితే అందుతున్న సమాచారం..అల్లు అర్జున్ వెనక్కి తగ్గాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రియల్ 8న అని విడుదల తేదీ ఫిక్సైనా..ఇప్పుడు దాన్ని మార్చాడని ట్రేడ్ వర్గాల సమచారం.
పవన్ కళ్యాణ్ పై గౌరవంతో అల్లు అర్జున్ డెశిషన్ మార్చుకున్నట్లు సమాచారం. సరైనోడు రిలీజ్ డేట్ మార్చమని తన నిర్మాతకు చెప్పాడని, ఇప్పుడు ఆ తేదీని ఏప్రియల్ 22కు మార్చారని వినపడుతోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ అయితే ఇంకా ఏమీలేదు.
మరో ప్రక్క డిస్ట్రిబ్యూటర్స్ సైతం పెద్ద సినిమాలు రెండు రిలీజ్ అవుతున్నప్పుడు మినిమం రెండు వారాలు గ్యాప్ లేకపోతే ఎలా అన్న విషయమై నిర్మాతలను నిలదీయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో బన్నీ ఈ నిర్ణయం తీసుకుని అనవసరమైన వివాదాలకు తావు ఇవ్వలేదని తెలుస్తోంది.