Don't Miss!
- News ద్రోణి ప్రభావం: ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన; అన్నదాతల ఆందోళన!!
- Finance Stock Market: ఎన్నికల ముందు మార్కెట్లలో అలజడి.. కుప్పకూలిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Sports ముంబయి ఇండియన్స్కు కొత్త బౌలర్ వచ్చాడు
- Automobiles కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
'ఎర్రబస్సు' రోడ్డెక్కే రోజు ఖరారు
హైదరాబాద్ : మంచు విష్ణుహీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఎర్రబస్సు'. కేథరిన్ హీరోయిన్. దాసరి నారయణరావు ముఖ్య పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్సిటీలోని జరుగుతోంది. చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రిస్తున్నారు. తమిళంలో విజయవంతమైన 'మాన్జపై'కిది రీమేక్. ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించిన ప్రోమోలు వదలాలని దాసరి నిర్ణయించినట్లు తెలుస్తోంద
దాసరి నారాయణరావు మాట్లాడుతూ ...నేను దర్శకత్వం వహిస్తున్న 151వ చిత్రమిది. కథానుగుణంగానే దీనికి ఎర్రబస్సు అనే టైటిల్ను పెట్టాం. ఓ అమాయక పల్లెటూరి రైతుకు, అతని మనవడికి మధ్య నెలకొన్న సున్నితమైన భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అని తెలిపారు.
విమల్, లక్ష్మీ మీనన్, రాజ్కిరణ్ ప్రధాన పాత్రల్లో తమిళంలో తెరకెక్కిన చిత్రం మంజాపై. ఎన్.రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్, సర్కునమ్ సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కించాయి. ఈ ఏడాది జూన్లో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్ర రీమేక్ హక్కులను సౌభాగ్య మీడియా లిమిటెడ్ సొంతం చేసుకుంది.
తెలుగుతో పాటు హిందీ, బెంగాళీ, గుజరాతీ, మరాఠీ పంజాబీ, రాజస్తానీ, సింధి, భోజ్పురీ, ఒరియా..ఇలా ఉత్తారాదికి చెందిన అన్ని భాషల్లోనూ పునర్నిర్మాణ హక్కులు సౌభాగ్య మీడియా సొంతం చేసుకుంది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల మేళవింపుతో రూపొందింది.
ఇందులో పల్లెటూరు నుంచి వచ్చే అమాయక తాత పాత్రను దాసరి పోషిస్తుండగా, ఆయన మనవడి పాత్రలో మంచు విష్ణు నటించనున్నారు. బ్రహ్మానందం, యమ్.ఎస్.నారాయణ, కృష్ణుడు, అలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:చక్రి, సినిమాటోగ్రఫీ: అంజి.