Don't Miss!
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- News Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘దృశ్యం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ (అఫీషియల్ డీటేల్స్)
హైదరాబాద్: వెంకటేష్, మీనా జంటగా శ్రీప్రియ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ 'దృశ్యం' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబడుతోంది. ఈ సినిమా ఓపెనింగ్స్ కాస్త వీక్గా ఉన్నప్పటికీ....ఫస్ట్ డే పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో రెండో రోజు నుండి సినిమా కలెక్షన్ల పరంగా పుంజుకుంది.
జులై 11న విడుదలైన 'దృశ్యం' ఫస్ట్ వీకెండ్( శుక్ర, శని, ఆది) రూ. 5.23 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ తెలిపారు. ఇదంతా కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వసూలైన మొత్తం మిత్రమే. ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా కలుపుకుంటే మరో రూ. 1 ఉంటుందని అంచనా.
ఈ చిత్రాన్ని రాజ్కుమార్ థియేటర్స్, సురేష్ ప్రొడక్షన్స్, వైడ్ యాంగిల్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజ్కుమార్ సేతుపతి నిర్మాత. డి.సురేష్బాబు సమర్పకులు. చిత్రంలో నదియా ఓ కీలక పాత్రలో నటించింది. సినిమాకు ఊహించిన దానికంటే రెస్పాన్స్ ఎక్కువగానే వస్తుండటంతో దర్శకత నిర్మాతలు సంతోషంగా ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి శాటిలైట్స్ కూడా భారీగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ తెలుగు ఛానల్ ఈ చిత్రానికి రూ. 6 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
చిత్రం కథ విషయానికి వస్తే...తన ఊళ్లో కేబుల్ నడుపుకుంటున్న రాంబాబు(వెంకటేష్) కి తను చూసే సినిమాలు, తన భార్య(మీనా) పిల్లలే లోకం. తన జీవితంలో వచ్చే సమస్యలకు తను చూసిన సినిమాల్లోంచే పరిష్కారాలు వెతుక్కునే అతను ఊహించని సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది.
అతని కుమార్తె అంజు బట్టలు మార్చుకునేటప్పడు...సెల్ లో వీడియో తీసి వరుణ్ అనే కుర్రాడు బ్లాక్ మెయిల్ చేస్తూంటాడు. దాన్ని నుంచి తప్పించుకునే ప్రాసెస్లో వరుణ్..అంజు చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. వరుణ్ ... ..పోలీస్ ఐజీ గీతా ప్రభాకర్ (నదియా) కొడుకు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు ఏం చేసాడు. ఏ విధంగా ప్లాన్లు వేసి, తన కుటుంబాన్ని వేటాడటానికి సిద్దమైన పోలీస్ డిపార్టమెంట్ నుంచి కాపాడుకున్నాడు అనేది ఉత్కంట కలిగించే కథనం.