Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఒకే రోజు తేడాలో: మహేష్, రామ్ చరణ్...రచ్చ
హైదరాబాద్ : ఎన్నడూ లేని విధంగా టీజర్స్ పోటీ మొదలైంది. రామ్ చరణ్, మహేష్ చిత్రాల టీజర్స్ ఒక రోజు తేడాలో అభిమానులను అలరించటానికి సిద్దమవుతున్నాయి. దసరాని పురస్కరించుకుని ఈ టీజర్స్ ని వదలనున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ చిత్రం గోవిందుడు అందరివాడేలే టీజర్ ని 7 వ తేదీ రాత్రి వదులుతూంటే, 8 వ తేదీ రాత్రికి మహేష్ బాబు ఆగడు టీజర్ రానుంది. ఈ టీజర్ లలో ఏది ఆకట్టుకుంటుందో చూడాల్సిందే.
చిత్రాల ప్రస్తుత పరిస్ధితి కి వస్తే... రామ్చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కాజల్ హీరోయిన్ . కృష్ణవంశీ దర్శకుడు. బండ్ల గణేష్ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో రామోజీ ఫిల్మ్సిటీలో జరగబోతోంది. ఎం.సిటీ 'ఎ' భవనంలో దీనికోసం ఓ సెట్ను రూపొందిస్తున్నారు.
రామోజీ ఫిల్మ్సిటీలోని కొండ ప్రాంతంలో 'ఆగడు' పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. విజయ్ మాస్టర్ నేతృత్వంలో మహేష్బాబు, సోనూసూద్పై ఫైట్ చిత్రీకరిస్తున్నారు. ఈ నెల ఎనిమిది వరకు ఇక్కడే చిత్రీకరణ ఉంటుంది. అన్నట్లు ఈ నెల తొమ్మిదిన మహేష్ జన్మదినం సందర్భంగా 'ఆగడు' రెండో ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తారని సమాచారం.