twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకే రోజు తేడాలో: మహేష్, రామ్ చరణ్...రచ్చ

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎన్నడూ లేని విధంగా టీజర్స్ పోటీ మొదలైంది. రామ్ చరణ్, మహేష్ చిత్రాల టీజర్స్ ఒక రోజు తేడాలో అభిమానులను అలరించటానికి సిద్దమవుతున్నాయి. దసరాని పురస్కరించుకుని ఈ టీజర్స్ ని వదలనున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ చిత్రం గోవిందుడు అందరివాడేలే టీజర్ ని 7 వ తేదీ రాత్రి వదులుతూంటే, 8 వ తేదీ రాత్రికి మహేష్ బాబు ఆగడు టీజర్ రానుంది. ఈ టీజర్ లలో ఏది ఆకట్టుకుంటుందో చూడాల్సిందే.

    చిత్రాల ప్రస్తుత పరిస్ధితి కి వస్తే... రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కాజల్‌ హీరోయిన్ . కృష్ణవంశీ దర్శకుడు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో రామోజీ ఫిల్మ్‌సిటీలో జరగబోతోంది. ఎం.సిటీ 'ఎ' భవనంలో దీనికోసం ఓ సెట్‌ను రూపొందిస్తున్నారు.

    Dussera Teasers Battle Begins

    రామోజీ ఫిల్మ్‌సిటీలోని కొండ ప్రాంతంలో 'ఆగడు' పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. విజయ్‌ మాస్టర్‌ నేతృత్వంలో మహేష్‌బాబు, సోనూసూద్‌పై ఫైట్‌ చిత్రీకరిస్తున్నారు. ఈ నెల ఎనిమిది వరకు ఇక్కడే చిత్రీకరణ ఉంటుంది. అన్నట్లు ఈ నెల తొమ్మిదిన మహేష్‌ జన్మదినం సందర్భంగా 'ఆగడు' రెండో ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తారని సమాచారం.

    English summary
    The Dussera Teasers Battle Begins!..AV from 7th night & Aagadu 8th Midnight!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X