Don't Miss!
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
సంపత్ నందికి రిలీఫ్
హైదరాబాద్: ఇప్పుడున్న పరిస్దితుల్లో చిన్న సినిమాకు శాటిలైట్ రైట్స్ అమ్మటం అనేది చాలా పెద్ద సవాల్ గా మారింది. అందులోనూ యావరేజ్ లేదా ప్లాఫ్ టాక్ వచ్చిన సినిమా కు అయితే మరీను. దాంతో శాటిలైట్ రైట్స్ అమ్మితే నిర్మాత చాలా రిలీఫ్ ఫీలవుతున్నారు. తాము పెట్టిన పెట్టుబడిలో కొంతలోకొంత రికవరీ అయ్యిందని ఆనందపడుతున్నారు. మరో ప్రక్క దర్శకుడు,టెక్నీషియన్స్ త్వరలో తమ సినిమా చూడనివారు సైతం టీవిల్లో చూస్తారనే ఉత్సాహం వారిలో కనపడుతుంది. తాజాగా 'గాలిపటం' చిత్రం శాటిలైట్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఈ చిత్రాన్ని జెమినీ టీవి వారు మంచి రేటుకే తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో నిర్మాత సంపత్ నంది రిలీఫ్ గా ఉన్నారు.
పవన్ తో ...గబ్బర్ సింగ్ 2 చేస్తున్న ...సంపత్ నంది ఇప్పుడు 'గాలి పటం' సినిమాతో నిర్మాతగా మారారు. అతని స్నేహితులు కిరణ్, విజయ్లతో కలసి ఎల్.ఎ.టాకీస్ పతాకంపై ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రం ద్వారా నవీన్ గాంధీ దర్శకునిగా పరిచయం అయ్యారు. ఆది, రాహుల్, ఎరికా ఫెర్నాండేజ్, క్రిస్టినా అకీవా ప్రధాన పాత్రధారులు.
''సినిమా చూశాక ప్రేక్షకులు బాగుందనో, బాగోలేదనో చెబుతుంటారు. 'గాలిపటం' చూసి బయటికొచ్చిన వాళ్లు మాత్రం కొత్తగా ఉందంటున్నారు. మేం నమ్మిన ఆ కొత్తదనమే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇలాంటి చిత్రాలకు ప్రోత్సాహం దక్కితే మేలు జరుగుతుంది. మరిన్ని కొత్త తరహా చిత్రాలు రూపుదిద్దుకొనే అవకాశాలుంటాయి'' అన్నారు సంపత్ నంది.
ఆది మాట్లాడుతూ ''ఇదివరకు నేను నటించిన రెండు చిత్రాలు సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. 'గాలిపటం'తో లభించిన విజయం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మా కొత్త ప్రయత్నం మంచి ఫలితం అందించింద''న్నారు. ''యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకూ సినిమా బాగా నచ్చింద''న్నారు దర్శకుడు.
ప్రీతిరాణా, పోసాని కష్ణమురళి, సప్తగిరి, వేణు, చంద్ర, దువ్వాసి మోహన్, శ్రీమన్నారాయణ, రామారావు, ప్రగతి, హేమ, శకుంతల, గీతాంజలి, రేఖ, రత్నాసాగర్, పావలా శ్యామల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: సంపత్నంది, కిరణ్ ముప్పువరపు, విజయకుమార్ వట్టికూటి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యం.యస్.కుమార్.