Don't Miss!
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అదీ పవన్ కళ్యాణ్ అంటే....
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ పేరు చెప్తే చాలు భాక్సాఫీస్ వద్ద కాసులు కురుస్తాయి. అందుకే ఆయన్ను ఏదో విధంగా సినిమాలో వాడటం కూడా చేసి క్రేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది పవన్ స్వయంగా నటిస్తున్న సినిమా పరిస్ధితి ఎలా ఉంటుంది. ఆ క్రేజ్ ని ఊహించలేం. అత్తారింటికి దారేది చిత్రం వస్తున్న చిత్రం గోపాల గోపాల. ఈ చిత్రం నెల్లూరు జిల్లా థియోటర్ రైట్స్ రెండు కోట్ల ఇరవై లక్షలకు అమ్ముడు పోయాయని సమాచారం. ఈ మొత్తం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే పవన్ కి భాక్సాఫీస్ వద్ద ఉన్న స్టామినా ముందు ఈ మొత్తం చిన్నదే అనిపిస్తుంది.
వెంకటేష్, పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్ కుమార్ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. శరత్మరార్, సురేష్బాబు నిర్మాతలు. ఈ చిత్రం మొదటనుంచీ అనుకుంటున్నట్లుగానే సంక్రాంతి రోజు అంటే జనవరి 15న విడుదల చేయటానికే తేదీని ఖరారు చేసినట్లు సమాచారం.
హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్' చిత్రానికిది రీమేక్. పవన్ కల్యాణ్ మోడరన్ కృష్ణుడు పాత్రలో కనిపిస్తాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... ''భూకంపం కారణంగా తనకు జరిగిన అన్యాయానికి ప్రకృతే కారణమని నష్టపరిహారం ఇవ్వడానికి బీమా సంస్థ నిరాకరిస్తుంది. ఆ సమయంలో ఆ వ్యక్తి ఏం చేశాడనే అంశం ఆధారంగా చిత్రం రూపొందుతోంది. పవన్ కల్యాణ్, వెంకటేష్ కలయికలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. స్వామీజీగా మిథున్ చక్రవర్తి నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది'' అంటున్నారు.
సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్రంలో కృష్ణుడు, మధుశాలిని, వెన్నెల కిషోర్, దీక్షా పంత్ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్, కూర్పు: గౌతంరాజు