Don't Miss!
- Sports RCB vs KKR: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
షాక్... అంత తక్కువ బడ్జెట్ లో తీసారా?
హైదరాబాద్: పివిపి సినిమాస్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బేనర్ వారు సంయుక్తంగా నిర్మించిన సస్పెన్స్ డ్రామా ‘క్షణం'. అడవిశేష్, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో నటించింది. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ముఖ్య పాత్రలు పోషించారు. రవికాంత్ పేరెపు దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం ఈ వీకెండ్ విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
‘క్షణం' రివ్యూ
మహేష్ బాబు, సమంత ఈ సినిమాను ప్రమోట్ చేయడం, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటం, పబ్లిసిటీ కూడా బాగా చేయడంతో మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి మూడు నాలుగు రెట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ సినిమాను కేవలం రూ. 1 కోటి ప్రొడక్షన్ ఖర్చుతో తెరకెక్కించారు. అయితే పబ్లిసిటీ కోసం మరో కోటి రూపాయలు ఖర్చు చేసారు. ఇలా మొత్తం 2 కోట్ల బడ్జెట్ అయింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఓవరాల్ రన్ లో కనీసం 6 నుండి 8 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. శాటిలైట్ రైట్స్ రూపంలో నిర్మాతలకు మరింత ఆదాయం రాబోతోంది.
అడవిశేష్, ఆదాశర్మ, అనసూయ భరద్వాజ, సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవివర్మ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి స్టోరీ: అడవి శేష్, ఎడిటింగ్: అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరెపు, స్క్రీన్ ప్లే: రవికాంత్ పేరెపు, అడవి శేష్, సాహిత్యం: సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్: అబ్బూరి రవి, నిర్మాత: పరమ్ వి.పొట్లూరి, కెవిన్, అన్నె, దర్శకత్వం: రవికాంత్ పేరెపు.