Don't Miss!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
'సోగ్గాడే చిన్ని నాయనా' ఆడియో లాంచ్ డేట్
హైదరాబాద్ : అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ... 'సోగ్గాడే చిన్ని నాయనా'. సంక్రాంతి కానుకగా జనవరి 15న మన ముందుకు రానున్న ఈ చిత్రం ఆడియోని డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ ఆడియోని విడుదల చేస్తున్నారు. అక్కినేని అభిమానులు ఈ వేడుకకు భారిగా తరలి రానున్నారు.
Soggade Chinni Nayana Audio Release On Dec 25
Posted by Akkineni Nagarjuna on 22 December 2015
ఈ చిత్రంలో రాము అనే పాత్రలో చాలా ఎంజాయ్ చేశానని నాగార్జున అన్నారు. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో కొడుకు పాత్ర పేరే రాము. దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఈ పాత్రని చాలా భిన్నంగా, ఆసక్తికరంగా రూపొందించారని నాగార్జున అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ వీడియోని ఇక్కడ చూడండి.
ఈ పాత్ర గురించి నాగార్జున మాట్లాడుతూ.. సినిమాలో రాము ఒక డాక్టర్. చాలా తెలివైనవాడు. అయితే అతనికి వేషభాషల గురించి ఏ మాత్రం తెలియదు. జుట్టు దువ్వుకోవడం, సరిగా చొక్కా వేసుకోవడం.. ఏవీ తెలియవు. అంతే కాదు చిన్న చిన్న వాడుక పదాలకి కూడా గూగుల్లో అర్థాలు వెదుకుతుంటాడని, ఈ పాత్రలో నటించే సమయంలో చాలా ఎంజాయ్ చేశానని అన్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తూ...వినోదం, కుటుంబ అనుబంధాల సమాహారంగా తెరకెక్కుతున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా' . ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదలై నాగార్జున అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆ ట్రైలర్ మీరు ఇక్కడ చూడండి.
రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి హీరోయిన్స్. వినూత్న కథాంశంతో గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయంలో కనిపిస్తున్నరు. రెండు పాత్రలు సరికొత్త పంథాలో సాగుతాయని చిత్ర యూనిట్ చెబుతోంది.
లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం. హంసానందిని, అనసూయ , చలపతిరావు, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రామ్మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్, సంగీతం: అనూప్ రూబెన్స్.