Don't Miss!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
దీపావళికి టీజర్... డిసెంబర్ 19న రిలీజ్
హైదరాబాద్: నితిన్ హీరోగా శ్రేష్ట్ మూవీస్ సంస్థ ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘చిన్నదాన నీ కోసం'. రీసెంట్ గా యూరప్లో షూటింగ్ జరుపుకుని వచ్చిన ఈ చిత్రం దీపావళికి టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే డిసెంబర్ 19న చిత్రాన్ని విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాత తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ....35 రోజుల పాటు యూరప్ లో వర్క్ చేసి వచ్చామన్నారు. దీంతో తొంభై శాతం చిత్రం పూర్తవుతుందనీ, మిగిలిన టాకీ పార్ట్, ఒక పాటను రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన ఎన్.సుధాకరరెడ్డి చెప్పారు. డిసెంబర్ 19న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
‘మా గత చిత్రాలు ‘ఇష్క్', ‘గుండె జారి గల్లంతయ్యిందే' మించి సంగీతాన్ని అనూప్ రూబెన్స్ అందించారు. ఆండ్రూ కెమెరా, హర్షవర్ధన్ మాటలు ఈ చిత్రానికి ప్లస్ అవుతాయని మరో నిర్మాత నికితారెడ్డి చెప్పారు. అలాగే..... ఈ సినిమా ఇండియాతో పాటూ అబ్రాడ్లోనూ భారీ వ్యయంతో చిత్రీకరణ జరుపుకుంటుంది. శ్రేస్ట్ మూవీస్లో గతంలో వచ్చిన "ఇష్క్", "గుండేజారి గల్ల౦తయ్యి౦దే" లా౦టి విజయాల అన౦తర౦ తీస్తున్న ఈ మూడో సినిమా కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని తెలిపారు.
‘గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాకు హిట్ సినిమా సాంగ్స్ లో లైన్ ని టైటిల్ గా ఎంచుకున్న నితిన్ ఈ సినిమాకి కూడా తన ఇష్క్ సినిమాలోని ఓ పాటలోని ‘చిన్నదాన నీ కోసం' అనే ఫేమస్ లైన్ ఎంచుకోవడంతో ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంగా ఉన్నారు.
ఈ చిత్రంలో నితిన్ సరసన బాలీవుడ్ భామ మిస్తి హీరోయిన్ గా నటిస్తోంది. ఎప్పుడు రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో ఆకట్టుకునే కరుణాకరన్ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని కూడా మిక్స్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. నితిన్ హోం బ్యానర్ అయిన శ్రేష్ఠ్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
శ్రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విక్రమ్ గౌడ్ సమర్పకులు. నితిన్ సరసన బాలీవుడ్ హీరోయిన్ మిస్తీ జోడి కడుతోంది. ఈ చిత్రంలో ఆలీ, నరేశ్, సితార, మధునందన్ ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, సంగీతం: అనుప్ రూబెన్స్, సినిమాటోగ్రఫి: ఆండ్రూ, ఆర్ట్ రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్ గౌడ్.