Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
బట్ ఫర్ ఎ ఛేంజ్...అంటూ 'జనతాగ్యారేజ్' టీజర్ వచ్చేసింది..
హైదరాబాద్ : అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనతాగ్యారేజ్ టీజర్ వచ్చేసింది. "బలవంతుడు ..బలహీనుడ్ని భయపెట్టి బ్రతకటం ఆనవాయితీ అయితే ..బట్ ఫర్ ఎ ఛేంజ్...ఆ బలహీనుడు ప్రక్కన కూడా ఓ బలం ఉంది. జనతాగ్యారేజ్.. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును" అని ఎన్టీఆర్ చెప్పే డైలాగుతో ఈ టీజర్ వదిలారు. ఈ టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపుచేసేసారు. మీరు ఇక్కడ ఆ టీజర్ ని చూడవచ్చు.
మైత్రిమూవీ మేకర్స్ బ్యానర్పై వస్తోన్న ఈ మూవీలో మలయాళ స్టార్ మోహన్లాల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. సమంత, నిత్యమీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు ఆగస్టు 12న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం జూలై 25 న ఆడియో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఆడియో పంక్షన్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. మొదట ఈ ఆడియో పంక్షన్ ని న్యూ జర్సీలో ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ కు ఛేంజ్ చేసినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఆడియో పంక్షన్ ప్లాన్ చేసినా, ఏర్పాట్లు చేయటం కష్టమని ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు.
ఇక ఆడియో పంక్షన్ రోజే ...చిత్రానికి సంభందించిన ధియోటర్ ట్రైలర్ విడుదల చేస్తున్నారు. అలాగే సాంగ్ టీజర్స్ తో ఓ వారం రోజులు పాటు దమ్ము రేపనున్నారు. ఈ నెల సైలెంట్ గా షూటింగ్ జరిపి, వచ్చే నెల నుంచి ఇక ప్రమోషన్ ని ప్రారంభించనున్నారు.
ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మిర్చి, శ్రీమంతుడు సినిమాల తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో సంచలనం క్రియేట్ చేస్తోందట. ముఖ్యంగా ఈ సినిమా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్రాజు భారీ రేట్కు సొంతం చేసుకున్నారు. మొత్తానికి ఈ సినిమాకు 61 కోట్లకు పైగానే బిజినెస్ జరిగినట్టు తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు ఎన్టీఆర్.
ఇప్పటికే రూ. 61 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. ఎన్టీఆర్ కెరీర్లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా రూ. 60 కోట్ల దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఇదంతా కొరటాల శివ ఎఫెక్టే అని చెప్పక తప్పదు. సినిమా హిట్టయితే రూ. 70 నుండి 80 కోట్ల మేర వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.