Don't Miss!
- News ఏకగ్రీవంగా సికింద్రాబాద్.. మోడీ-అమిత్ షా గేమ్ ప్లాన్?
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'అత్తారింటికి దారేది' రికార్డు బ్రద్దలు కొట్టాడు
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది చిత్రం ఎన్నో విషయాల్లో మరెన్నో రికార్డులును క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అభిమానులు మాత్రమే కాక అందరినీ అలరించిన ఈ చిత్రం రిలీజ్ కు ముందు వచ్చిన ట్రైలర్ సైతం రికార్డు క్రియేట్ చేసింది. అప్పట్లో సౌత్ నుంచి వచ్చిన ఓ టీజర్ మూడు మిలియన్ల క్లబ్ లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు విక్రమ్ హీరోగా వచ్చిన ఐ చిత్రం టీజర్ ...ఆ రికార్డును బ్రద్దలు కొట్టింది. ఐదున్నర మిలియన్ల వ్యూస్ తో మొట్టమొదటి సౌత్ చిత్రం గా రికార్డు నమోదు చేసింది.
దక్షిణాది సినీ చరిత్రలోనే అత్యధికంగా 180కోట్ల భారీ బడ్జెట్తో దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ఐ సరికొత్త సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. ఆస్కార్ ఫిలింస్ బ్యానర్పై రవిచంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్రమ్, అమీజాక్సన్ జంటగా నటిస్తున్న ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దీపావళికి ప్రేక్షకులముందుకు వస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను ఇటీవలే ఆడియో వేడుకలో విడుదల చేసిన విషయం తెలిసిందే. వారం వ్యవధిలోనే టీజర్ను 5 మిలియన్ల మంది వీక్షించారని, తమిళ సినీ చరిత్రలోనే ఇదొక కొత్త రికార్డని చిత్ర వర్గాలు వెల్లడించాయి.
దర్శకుడు శంకర్ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం ప్రత్యేకించి పలు హాలీవుడ్ కంపెనీలు పనిచేశాయి. ఆ ప్రతినిధులు షూటింగ్ చూసి ఇలాంటి సినిమాల్లో నటించడం విక్రమ్లాంటి నటుడికే సాధ్యమన్నారు. అంత అంకిత భావంతో విక్రమ్ నటించాడు'' అన్నారు.
విక్రమ్ మాట్లాడుతూ ''శంకర్ లాంటి దర్శకుడి చిత్రంలో మళ్లీ నటించడం వరంగా భావిస్తున్నా. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ ముందు కన్పిస్తున్న 'మృగం' వంటి పాత్ర కోసం కనిష్టంగా మూడు గంటల పాటు మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఎంతో ఓర్పుతో మేకప్ వేసుకుని కెమెరా ముందుకెళ్లాను. ఇలాంటి సినిమాలో నటించడం ఓ సవాలు లాంటిదే. ఇలాంటి మరో నాలుగు పాత్రల్లో సినిమాలో కన్పిస్తాను. ''అన్నారు.