Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
‘ఆగడు’ థియేటర్లను ఆక్రమించిన ‘పవర్’
హైదరాబాద్: మాస్ మహరాజ్ రవితేజ నటించిన ‘పవర్' చిత్రం రెండో వారంలోనూ మంచి బిజినెస్ చేస్తోంది. మహేష్ బాబు ‘ఆగడు' చిత్రం విడుదలైనా ‘పవర్' చిత్రంపై పెద్దగా ప్రభావం చూపలేక పోయిందని ట్రేడ్ టాక్. ‘ఆగడు' సినిమాకు మిక్డ్స్ టాక్ రావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
‘ఆగడు' చిత్రం నైజాం ఏరియాలో దాదాపు 298 థియేటర్లలో విడుదలైంది. తొలి మూడు రోజులు గడిచిన తర్వాత దాదాపు 50 థియేటర్లలో ‘ఆగడు' చిత్రాన్ని తీసేస్తున్నట్లు సమాచారం. ఆయా థియేటర్లను సోమవారం నుండి ‘పవర్', ‘గీతాంజలి' సినిమాలతో రీప్లేస్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక మిగిలిన థియేటర్లలో ‘ఆగడు' చిత్రం విజయవంతంగా రన్ అవుతోంది.
శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘ఆగడు' చిత్రంలో మహేష్ బాబు-తమన్నా జంటగా నటించారు. సినిమా విడుదలైన తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చింది. ఫస్టాఫ్ వినోదాత్మకంగా ఉన్నప్పటికీ సెకండాప్ రొటీన్ రివేంజ్ డ్రామా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే మహేష్ బాబు టాప్ స్టార్ కావడంతో ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి.
ఇక ‘పవర్' సినిమా విషయానికొస్తే....బాబీ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో రవితేజ, హన్సిక, రెజీనా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా నాలుగైదు హిట్ సినిమాల్లోని స్టోరీ లైన్స్, సీన్లు కాపీ కొట్టి తీసారనే విమర్శలు సొంతం చేసుకుంది. అయితే రవితేజ పెర్ఫార్మెన్స్ వినోదాత్మకంగా ఉండటంతో విజయవంతంగా రన్ అవుతోంది.