Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఖరారు : రామ్ చరణ్ ‘రామ్ లీల’రిలీజ్ డేట్ (పోస్టర్)
హైదరాబాద్ : రామ్చరణ్, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే' చిత్రం తమిళంలోకి ‘రామ్లీల' టైటిల్ తో డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం బిజినెస్ పూర్తి చేసుకుని విడుదల సిద్దమైంది. ఈ సందర్బంగా విడుదల తేదీ పోస్టర్స్ ని విడుదల చేసారు తమిళ నిర్మాతలు. సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక్కడ ఆ పోస్టర్ ని చూడవచ్చు.
తమిళంలో కూడా రామ్చరణ్కు మంచి మార్కెట్ ఉంది. అలాగే దర్శకుడు కృష్ణవంశీ, హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా తమిళ ప్రేక్షకులకు పరిచయమున్న వ్యక్తులు కావడం విశేషం. దీంతో ఈ చిత్రాన్ని తమిళ ప్రేక్షకులకు కూడా ఆదరిస్తారని చిత్ర బృందం భావిస్తున్నారు.
‘గోవిందుడు అందరివాడేలే' గత ఏడాది దసరా కానుకగా విడుదలైన యావరేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సినిమా వర్క్ అవుట్ కాకపోయినా రామ్ చరణ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ని తెచ్చి పెట్టింది. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. దాంతో ఈ సినిమాని తమిళంలో రిలీజ్ చెయ్యడానికి సిద్దమవుతున్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
రామ్ చరణ్ తాజా చిత్రం బ్రూస్ లీ విషయానికి వస్తే...
"వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్లు వినపడవ్! రియాక్షన్లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు.
విడుదలైన మూడు రోజుల్లోనే 1 మిలియన్ (10 లక్షల) వ్యూస్ సాధించి చెర్రీ సినిమా టీజర్ యూట్యూబ్లో ముందుకు వెల్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. అక్టోబర్ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేస్తున్నారు.
తమన్ చెప్తున్న దాని ప్రకారం సెప్టెంబర్ మిడిల్ లో ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేయనున్నారు. అంతే కాకుండా ఇప్పటివరకూ జరిగిన షూటింగ్ రషెస్ మరియు టీం స్పీడ్ చూసిన తమన్ సినిమా చాలా బాగా వస్తోందని తెలిపాడు.
ప్రస్తుతం రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ మరియు ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ...స్టంట్ మ్యాన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. సినిమాలకు పనిచేసే ఆ స్టంట్ మ్యాన్ తన వృత్తిలో భాగంగా ...అప్పటికే హీరోగా చేస్తున్న బ్రహ్మాజీకి బాడీ డబుల్ గా కనపడి...ఫైట్స్ చేస్తాడన్నమాట. ఈ సీన్స్ ని రీసెంట్ గా శ్రీను వైట్ల చిత్రీకరించారు.
దర్శకుడు మాట్లాడుతూ ''యాక్షన్తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీమోహన్ది విజయవంతమైన కాంబినేషన్ అనీ, ఆ కాంబినేషన్తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు.
అలాగే....
సినిమాలో కథలో భాగంగా.... చిరంజీవి హీరో గా నటిస్తున్న చిత్రానికి రామ్చరణ్ ఫైట్స్ కంపోజ్ చేస్తూ కనపడతాడు. రామ్చరణ్తో ఆయన శ్రీనువైట్ల చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్పై ఉంది. ఇందులో చిరంజీవి ఓ అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతున్నారు. సినిమా నేపథ్యంలో సాగే కథ ఇది.
చరణ్ ఫైట్ మాస్టర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చిరు ఓ 'స్టార్' పాత్రలో కనిపించబోతున్నారని, ఆయన నటించే చిత్రానికి చరణ్ ఫైట్ మాస్టర్గా పనిచేసే సన్నివేశం ఒకటుందని తెలుస్తోంది. చిరు కనిపించేది కొద్దిసేపే అయినా ఈ కథకు ఆ సన్నివేశం కీలకం కానుందట.
ఇది వరకు 'మగధీర'లో చిరంజీవి, రామ్చరణ్లు కలసి సందడి చేశారు. ఆ తరవాత తెరపై ఇద్దరూ కలిసి కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు చిరు, చరణ్ను ఒకే తెరపై చూసే అవకాశం అభిమానులకు దక్కుతోందని వారు ఆనందపడిపోతున్నారు.
ఈ చిత్రాన్ని ఈ దసరాకు విడుదల చేయాలని టార్గెట్ చేస్తున్నారు. రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ కలిసి స్క్రిప్టు అందిస్తూండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఎ.ఆర్. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అణల్ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్క్రీప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.