Don't Miss!
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- News Arvind Kejriwal: బెయిల్ కోసం కేజ్రీవాల్ పాట్లు, జైల్లో అవి తింటున్నారట!!
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ట్రేడ్ టాక్ : ‘రేయ్' ప్రీ రిలీజ్ బిజినెస్ పరిస్దితి
హైదరాబాద్ :సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రేయ్' చిత్రం ఈ నెల 27న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకుంది. ఈ చిత్రం బిజినెస్ విషయానికి వస్తే...ట్రేడ్ లో చెప్పుకునేదాని ప్రకారం వైవియస్ చౌదరి ఇరవై కోట్లు పెట్టుబడి పెట్టారని తెలుస్తోంది. అయితే రకరకాల కారణాలతో బిజినెస్ అనుకున్నంత వేగంగా జరగలేదు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
13 కోట్లు వరకే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అయితే సాయి ధరమ్ తేజ...ఇప్పటికి కేవలం ఒక సినిమా హిట్ హీరోనే కావటం కూడా కారణం కావచ్చు. పిల్లానువ్వు లేని జీవితం కు దాదాపు ఇంతే బిజినెస్ జరిగింది. దీనికీ ఇంతే. వైవియస్ చౌదరి ...ఎక్కువ పెట్టడం వల్ల తక్కువ బిజినెస్ జరిగిందనిపించవచ్చు కానీ...విడిగా చూస్తే బాగా బిజినెస్ చేసినట్లే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ నేపధ్యంలో ఏ ఏరియా..ఎవరు పంపిణీ చేస్తున్నారో ఓ సారి చూద్దాం.
సీడెడ్: లక్ష్మీ కాంత్ రెడ్డి ( 2.70కోట్లు)
వైజాగ్: నట్టికుమార్ - LK మీడియా
గుంటూరు: 7 రీల్ ఎంటర్టైన్మెంట్ ( 1.20 కోట్లు)
కృష్ణా: బద్రి ( 80లక్షలు)
తూర్పు గోదావరి: అనుశ్రీ ఫిల్మ్స్
పశ్చిమ గోదావరి: ఉషా పిక్చర్స్ ( 80 లక్షలు)
నెల్లూరు: హరి పిక్చర్స్ & సిరి మల్టిప్లెక్స్
కర్ణాటక: శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్
యుఎస్ ఎ: ప్రణీత మీడియా
ఇక సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి ‘A' సర్టిఫికెట్ జారీ చేసారు. అంతే కాకుండా సినిమాలో 41 చోట్ల సెన్సార్ కట్స్ విధించింది. మరో వైపు సినిమా రన్ టైం కూడా ఎక్కువగానే ఉంది. ఏకంగా 168 నిమిషాల నిడివి ఉంది. అంటే దాదాపు 2 గంటల 50 నిమిషాలు. మార్చి 27న ఈ సినిమా విడుదల కాబోతుంది. అదే రోజు రామ్ చరణ్ పుట్టిన రోజు కావడం విశేషం.
సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో ఓ డాన్సర్ లా కనిపిస్తాడు. డాన్సర్ గా అదిరిపోయే స్టెప్స్ వేశాడని సమాచారం. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేసేలా ఈ సినిమాలో అదిరిపోయే స్టెప్స్ తో మెగా అభిమానులకు పెద్ద ట్రీట్ ఇవ్వనున్నాడని ఈ సినిమా చూసిన కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా చివరి సాంగ్ లో సూపర్బ్ స్టెప్స్ తో ఆకట్టుకుంటాడని సమాచారం. సాయి ధరమ్ తేజ్ సరసన సయామీ ఖేర్, శ్రద్ధ దాస్ హీరోయిన్స్ గా నటించారు. వైవిఎస్ చౌదరి నిర్మించిన ఈ సినిమాని ఎక్కువ భాగం కరేబియన్ దీవులు, కాలిఫోర్నియాలో షూట్ చేసారు. స్వర్గీయ చక్రి సంగీతం అందించాడు.
వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ ''వెస్టిండీస్లో సెటిల్ అయిన ఓ కుటుంబానికి చెందిన యువకుడి కథ ఇది. అమెరికాలో జరిగే ఓ సంగీత పోటీ టైటిల్ పోరు నేపథ్యంలో చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఎక్కువ భాగం వెస్టిండీస్, అమెరికాలోనే చిత్రీకరించాం. అందుకే ఆ ప్రాంతాల్లో సినిమా ప్రత్యేక షోలు ఏర్పాటు చేస్తున్నాం. వెస్టిండీస్లో విడుదల కాబోయే తొలి తెలుగు సినిమా ఇది. '' అని తెలిపారు. ఈ చిత్రాన్ని వెస్టిండీస్ లో విడుదల చేస్తున్నారు. అక్కడ ఇంతకు ముందు ఏ తెలుగు సినిమా విడుదల కాలేదు. ఈ విషయాన్ని వైవియస్ చౌదరి మీడియాకు తెలియచేసారు.
అలాగే...''ఈ సినిమాకి చాలా సమయం పట్టింది. దానికి కారణం... ఈ సినిమాలోని విషయం అలాంటిది. సినిమా చూస్తే ఇంతకాలం ఎందుకు పట్టిందో మీకే అర్థం అవుతుంది'' అన్నారు.చిత్రంలో అర్పిత్ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నరేష్, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్.