Don't Miss!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- News మోదీ మీద మాజీ సీఎం తిరుగుబాటు ?, రివర్స్ గేర్ వేస్తున్న సిట్టింగ్ సీఎం, ఏం జరుగుతుందో ?
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Technology Lava నుంచి కొత్త స్మార్ట్ ఫోన్! మార్చి 22 న లాంచ్,టీజర్ విడుదలైంది
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
'సత్య -2' మరీ అంత దారుణ కలెక్షన్స్??
హైదరాబాద్ :సమాజంలో క్రైం అనేది ఎప్పటికీ చావదు...దాని రూపం మార్చుకుంటుంది, రాయల సీమ ఫ్యాక్షనిస్టులు, బెడవాడ రౌడీలు, హైదరాబాద్ గుండాల కాలం పోయింది. కొత్తరకం క్రైం చూపెట్టాం అని ప్రచారం చేస్తూ వర్మ తాజా చిత్రం సత్య 2 వచ్చింది. అయితే ఈ చిత్రం ప్రీమియర్ షో ల నుంచే నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అక్కడక్కడ కొన్ని పాజిటివ్ రివ్యూలు వచ్చినా సినిమాని కాపాడలేకపోయాయి. బాలీవుడ్ ట్రేడ్ లో చెప్పేదాన్ని బట్టి... వీకెండ్ లో కేవలం కోటిన్నర మాత్రమే ఈ చిత్రం వసూలు చేసింది. ఈ సినిమా ప్లేస్ లో హృతిక్ రోషన్ చిత్రం క్రిష్ 3 చిత్రం..ని చాలా చోట్ల ప్రైమ్ టైమ్ లో వేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హిందీలో వెర్షన్లో ముంబై అండర్ వరల్డ్ నేపథ్యాన్ని తీసుకున్నారు. పునీత్ సింగ్ రత్న్ సత్య పాత్రలో నటించాడు. తెలుగు వెర్షన్లో హైదరాబాద్ నేపథ్యం తీసుకున్నారు. శర్వానంద్ సత్య పాత్రలో నటించాడు.
ఇక మరో ప్రక్క సెన్సార్ బోర్డు ప్రాంతీయాధికారి ధనలక్ష్మిపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తరఫున ఆయన ప్రతినిధి సుధీర్ చంద్ర నాంపల్లి కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. దర్యాప్తు నిమిత్తం పోలీసులను ఆదేశించాలని, అమెను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని కోరారు. సత్య 2 సినిమాను ముంబయిలో కేవలం రెండు చోట్ల కట్ చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేయగా ఇక్కడ ప్రాంతీయ కార్యాలయంలో ధనలక్ష్మి 40 చోట్ల కట్ చేయాలని ఆదేశించారని ఆయన ఆరోపించారు. 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఈ ఫిర్యాదును విచారించే అవకాశం ఉంది.
కథ విషయానికొస్తే...సత్య(శర్వానంద్) అండర్ వరల్డ్కు రారాజు కావాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ వస్తాడు. తనదైన ఆలోచన విధానంతో ముందుకు సాగుతుంటాడు. తక్కువ టైంలోనే సత్య తన టాలెంట్ తో ఓ కంపెనీని మొదలు పెడతాడు. ఈ కంపెనీ పేరుతో కొంతమంది ప్రముఖులను చంపుతూ ఉంటారు. ప్రజలను భయ పెట్టి వేల కోట్లు సంపాదించాలనే టార్గెట్ పెట్టుకుంటాడు. కంపెనీ ఈ మాఫియ దేశం మొత్తం వ్యాపిస్తుంది. అదే సమయంలో కంపెనీ వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోడానికి ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ని నియమిస్తుంది. ఈ క్రమంలో సినిమా అనుకోని మలుపు తిరుగుతుంది. మరి సత్య అలా ఎందుకు మారాడు? సత్య కథ ఎలా ముగిసింది అనేది తెరపై చూడాల్సిందే.