Don't Miss!
- News మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ రెండు పెద్ద సినిమాల మధ్య దిల్ రాజు ‘శతమానం భవతి’ పరిస్థితి ఇదీ...!
హైదరాబాద్: ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాతో, నటసింహం బాలయ్య తన 100వ సినిమాతో బాక్సాఫీసు రేసులో దూకడంతో వీరిద్దరితో పోటీ పడలేని చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం పోటీకి బయ పడకుండా... సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకంతో తాను నిర్మించిన 'శతమానం భవతి' ఈ నెల 14న విడుదల చేసారు.
పోటీ ఉన్నప్పటికీ తన సినిమాకు ఆశించిన రిజల్ట్ వస్తుందని ధైర్యంగా ముందడుగు వేసిన దిల్ రాజు నమ్మకం నిలబడింది. సినిమా విడుదలైన అన్ని సెంటర్లలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. కాక పోతే ఖైదీ, శాతకర్ణి సినిమాలకు సంభించినన్ని థియేటర్లు దొరకలేదు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ (శని, ఆది) ఆంధ్రా, సీడెడ్, నైజాం ఏరియాలన్నింటిలో కలిపి రూ. 5.74 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
ఓపెనింగ్స్ అదిరాయి
సినిమా విడుదలైన తొలి రోజు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. పండగరోజు విడుదల కావడంతో రూ. 3.03 కోట్లు వసూలు చేసింది. ఆదివారం రూ. 2.71 కోట్లు వసూలు చేసింది.
ఓవర్సీస్ లో కూడా
ఓవర్సీస్ ఏరియాలో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. ఆదివారం వరకు $380,612 గ్రాస్ వసూలు చేసింది.
నైజాంలో
నైజాం ఏరియాలో ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో రూ. 1.98 కోట్లు వసూలు చేసింది. శర్వానంద్ సినిమాకు ఈ రేంజి వసూళ్లు రావడం అంటే గొప్పగానే చెప్పుకుంటున్నారు ట్రేడ్ వర్గాల్లో.
ఆంధ్రా, సీడెడ్
ఇక సీడెడ్ ఏరియాలో రూ. 67 లక్షలు, నెల్లూరు. 15.6 లక్షలు, గుంటూరు 47 లక్షలు, కృష్ణ రూ. 33.63 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 53.06 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 70.61 లక్షలు వసూలు చేసింది.