Don't Miss!
- News పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఉపేంద్ర ఎఫెక్టు...‘S/O సత్యమూర్తి’ కలెక్షన్స్ పై ఎంత?
హైదరాబాద్ :అల్లు అర్జున్, త్రివిక్రమ్ల కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘S/O సత్యమూర్తి'. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలకమైన పాత్రను పోషించారు. ఉపేంద్ర ..కన్నడలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది. విబిన్నమైన చిత్రాలతో అక్కడ ఆయన హీరోగా చాలా కాలం నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో కొనసాగుతున్నారు. దాంతో ఇప్పుడు సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఆయన్ని తీసుకోవటంతో ఖచ్చితంగా కలెక్షన్స్ పై ప్రబావం పడుతుందని అంతా భావించారు. ఇంతకీ ఆ ప్రభావం ఉందా..ఉంటే ఏ స్ధాయిలో ఉందో చూద్దాం...
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
తాజాగా కర్ణాటకలో ఈ సినిమా మొదటివారం 4.75కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి రికార్డు సృష్టించిందని అఫీషియల్ సమాచారం.ఇప్పటివరకూ కర్ణాటకలో మొదటివారం తెలుగు సినిమా కలెక్షన్ల విషయంలో ఈ సినిమాదే రికార్డు అని తెలుస్తోంది. నైజాం, ఆంధ్రా, సీడెడ్, అమెరికా ఇలా అన్ని ప్రాంతాల్లో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది.
భారీ అంచనాల మధ్య గత వారం విడుదలైన ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. అయితే కలక్షన్స్ పై ఆ ప్రభావం మాత్రం ఎక్కడా కనపడటం లేదని ట్రేడ్ వర్గాల సమాచారం. త్రివిక్రమ్ బ్రాండ్ నేమ్, బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్ కాస్టింగ్, కుటుంబ సినిమా అనే ముద్ర జనాలను థియోటర్లకు టాక్ కు సంభందం లేకుండా ప్రేక్షకులను థియోటర్లకు లాక్కొస్తోంది. ఈ నేపధ్యంలో ...కేవలం మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాక మిగతా చోట్ల సైతం సినిమా కలెక్షన్స్ విషయంలో రికార్డులు బ్రద్దలు కొడుతోంది.
మెదటి వారం పూర్తయ్యే సరికి అత్తారింటికి దారేది చిత్రం తరువాత టాప్ గ్రాసర్ గా ‘s/o సత్యమూర్తి నిలిచింది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ భారీ స్థాయిలో నిర్మించారు. సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. రికార్డు కలెక్షన్స్ మెదటి వారం పూర్తిచేసుకుని రెండవ వారంలో అదే కలెక్షన్స్ తో ముందుకుపోతుంది. అల్లు అర్జున్ కేవలం తెలుగు లోనే కాకుండా మళయాలం లో కూడా మల్లు అర్జున్ గా అక్కడి స్టార్ హీరోల రెవెన్యూతో పోటిపడటం తెలిసిందే.
ఇప్పుడీ చిత్రం మళయాళ వెర్షన్ ...ఏప్రియల్ 24న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మళయాళ వెర్షన్ కు చెందిన పోస్టర్స్ ,ప్రోమోలుతో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యి ఉంది. బిజినెస్ కూడా బాగా జరిగినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో భారీగానే మళయాళంలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.
మార్నింగ్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మల్టిఫ్లెక్స్ లు , ఎ సెంటర్లలలో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది. అయితే బి,సి సెంటర్లలలో మాత్రం డ్రాప్ అయ్యిందని ట్రేడ్ వర్గాల సమాచారం. మరి కేరళ భాక్సాఫీస్ వద్ద పరిస్దితి ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అక్కడ నిత్యామీనన్ ఉండటం కూడా ప్లస్ అవుతుంది.
అల్లు అర్జున్ సినిమా అంటేనే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది కుటుంబ ప్రేక్షకులను తనదైన సెంటిమెంట్, భావోద్వేగాలు, ఫన్ తో ఆకట్టుకునే త్రివిక్రమ్ జత కలిస్తే ఇంకేముంది. జులాయి ని మించిపోతుంది. ఇప్పుడు అందరి అంచనా ఇదే. దానికి తోడు విభిన్నమైన టైటిల్, అత్తారింటికి దారేది వంటి మెగా హిట్ తర్వాత త్రివిక్రమ్ నుంచి, రేసు గుర్రం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ వస్తున్న చిత్రం కావటం మరింతగా అంచనాలు పెంచేసింది. దాంతో టాక్ తో సంభందం లేకుండా ముందుకు వెళ్తోంది.
విలువైన మంచిమాటలే ఆస్తి అనే అంశాన్ని ఈ చిత్రంలో ప్రధానమైన అంశంగా తీసుకుని దర్శకుడు కథను రూపొందించారు. 'నాన్న నాకేమిచ్చాడు' అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు, బంగళాలూ, వూరవతల గెస్ట్ హౌస్లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని ఆస్తులు ఆయన చాలానే ఇస్తాడు. బతుకు పోరాటం నేర్పించేది నాన్నే. అంతెందుకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నాన్న. విరాజ్ ఆనంద్ నమ్మిందీ అదే. సత్యమూర్తి గారబ్బాయి విరాజ్ ఆనంద్. తండ్రంటే దస్తావేజులపై కనిపించే సంతకం కాదు.. నా జీవితం అని నమ్మిన విరాజ్.. ఆ తండ్రి కోసం ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
చిత్రం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ... ఇటీవల వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో...' సినిమాలో రాక్ గిటార్ ప్లేయర్గా చేశాను. 'రేసు గుర్రం'లో మధ్యతరగతి అబ్బాయిగా చేశాను. వాటితో పోలిస్తే, 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో నాది కొంత డిగ్నిటీ ఎక్కువున్న పాత్ర. హుందాతనం నిండిన ఆ పాత్రలో కూడా వస్త్రధారణలో ఒక స్టైల్ తెచ్చేందుకు ప్రయత్నించాం. పైగా, నేనెప్పుడూ ఒకటికి నాలుగు అలంకరణలతో నిండిన వస్త్రధారణ చేస్తుంటా. కానీ, పాటలు వదిలేస్తే, ఈ సినిమాలో కావాలనే అవన్నీ వదిలించుకొని, సింపుల్గా, సింగిల్ పీస్లో ఉండేలా చూశా. దాంతో, నేను కొత్తగా కనిపిస్తాను అన్నారు.
త్రివిక్రమ్ సినిమాలంటే పంచ్ డైలాగులు ఉంటాయని..సగటు ప్రేక్షకుడ్ని కూడా అలరిస్తాయని అందరికి తెలిసిన విషయమే. ఆయన మాటల్లోని పంచ్లు ప్రతి అభిమానికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. అందుకే ఆయన మాటల మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమా ఏదీ చూసిన తన డైలాగుల మార్క్ కనబడుతుంది. దానికి తగ్గట్టుగా త్రివిక్రమ్ డైలాగ్స్ ‘సత్యమూర్తి'కి సరికొత్త లుక్ని తీసుకొచ్చాడని చెబుతున్నారు.