Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సూపర్బ్: శ్రీమంతుడు ఫస్ట్ వీక్ కలెక్షన్స్(ఏరియా వైజ్)
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు' చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్బ్ కలెక్షన్స్ సాధిస్తోంది. బాక్సాఫీసు వద్ద విజయవంతంగా ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సూపర్ వసూళ్లు సాధించారు. వరల్డ్ ఫస్ట్ వీక్ ఈచిత్రం రూ. రూ. 57.73 కోట్ల షేర్ సాధించింది.
మరో వైపు శ్రీమంతుడు చిత్రం ఓవర్సీస్ మార్కెట్లోనూ కలెక్షన్లు అదరగొట్టింది. అమెరికాలో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లోనే 2 మిలియన్ డాలర్లు వసూలు చేసి రెండో స్థానం దక్కించుకుంది. యూఎస్ఏలో బాహుబలి ఏకంగా 6 మిలియన్ డాలర్లు వసూలు మొదటి స్థానంలో నిలిచింది.
ఇక ‘శ్రీమంతుడు' చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీక్ రూ. 38.55 కోట్ల షేర్ సాధించింది. ఏపీ-తెలంగాణలో ఫస్ట్ వీక్ ఈ రేంజిలో షేర్ రావడం అద్భుతమనే చెప్పాలి. చాలా ఏరియాలో శ్రీమంతుడు మూవీ నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. సినిమా ఓవరాల్ రన్ లో భారీగానే వసూలు చేస్తుందని భావిస్తున్నారు.
శ్రీమంతుడు మూవీ ఏరియా వైజ్ షేర్ డిటేల్స్ స్లైడ్ షోలో....
ఏపి-తెలంగాణ
శ్రీమంతుడు మూవీ ఆంధ్రలో రూ. 17.87 కోట్లు, తెలంగాణలో రూ. 14.38 కట్లు, సీడెడ్ లో రూ. 6.30 కోట్లు వసూలు చేసింది.
కర్ణాటక
శ్రీమంతుడు మూవీ కర్ణాటకలో ఫస్ట్ వీక్ రూ. 5.4 కోట్లు వసూలు చేసింది.
రెస్టాఫ్ ఇండియా
రెస్టాఫ్ ఇండియాలో శ్రీమంతుడు మూవీ రూ. 1.6 కోట్లు వసూలు చేసింది.
యూఎస్ఏ
శ్రీమంతుడు మూవీ యూఎస్ఏలో రూ. 9.75 కోట్ల షేర్ వసూలు చేసింది.
రిపోర్ట్స్ అందని అంచనాలు
ఓవరాల్ గా ఇంకా కొన్ని స్క్రీన్ల నుండి రిపోర్టు రాలేదు. ఆ స్క్రీన్ల నుండి రూ. 1.98 కోట్లు షేర్ రావచ్చని అంచనా.
తమిళం
శ్రీమంతుడు తమిళ వెర్షన్ ఫస్ట్ వీక్ రూ. 0.45 కోట్లు వసూలు చేసింది.