Don't Miss!
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
లాభాల పంట: బడ్జెట్ 31 కోట్లు, కలెక్షన్స్ 150 కోట్లు
హైదరాబాద్: మాధవన్, కంగనా రనౌత్ జంటగా ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం 31 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు 145 కోట్లు వసూలు చేసింది. త్వరలో ఈ చిత్రం 150 కోట్ల వసూళ్లను అందుకోబోతోంది.
సినిమాకు ఈ రేంజిలో కలెక్షన్లు రావడం చూసి అటు నిర్మాత క్రిషిక్ లుల్లా సైతం ఆశ్చర్య పడుతున్నారు. త్వరలోనే మా చిత్రం ‘దబాంగ్-2' 158 కోట్ల రికార్డును అందుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేసారు. ఇప్పటి వరకు ఈ చిత్రం సాధించిన కలెక్షన్ల వివరాల ప్రకారం.... బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన 12వ చిత్రం ‘తను వెడ్స్ మను రిటర్న్స్' రికార్డులకెక్కింది.
రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. గతంలో మాధవన్ నటించిన ‘తను వెడ్స్ మను' చిత్రం మంచి విజయం సాధించింది. దీనికి సీక్వెల్ గా తాజాగా ‘తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదలై ఇప్పటికే బాక్సాఫీసు వద్ద 4 వారాలు పూర్తయింది. ఈ చిత్రం సాధించిన లాభాల శాతం 368%గా నమోదైంది.