Don't Miss!
- News టిప్పర్ నడుపుకుంటూ వెళ్లి మరీ నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
త్రిష,అనుష్క కలిసి... ఈ నెల 22 న పండుగ చేస్తారు
హైదరాబాద్ : అజిత్ హీరో గా నటించిన తమిళ చిత్రం ఎన్నై అరింధాల్. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎంతవాడుగాని అనే పేరుతో శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అనుష్క, త్రిష హీరోయిన్స్. ఈ చిత్రానికి ఏ.ఎం రత్నం నిర్మాత. ఈ చిత్ర తెలుగు వెర్షన్ ఈ నెల 22న మనముందుకురానుంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
దర్శకుడు మాట్లాడుతూ.... యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమిది. అజిత్ పాత్ర చిత్రణ మూడు భిన్న పార్శాల్లో సాగుతుంది. ఆయన నటన, పోరాటాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఆధునిక యువతిగా అనుష్క, సంప్రదాయ నృత్యకారిణిగా త్రిష అభినయం అందరిని అలరిస్తుంది. కర్తవ్య నిర్వహణనే తన ప్రాణంగా భావించే ఓ పోలీస్ ఆఫీసర్కు వృత్తిలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది ఇందులో ఆసక్తికరంగా ఉంటుంది.
నిర్మాత మాట్లాడుతూ.... ఎన్.టి.రామారావు నటించిన భలే తమ్ముడు చిత్రంలోని ఎంతవారు గానీ... పాట పల్లవిని ఆధారం చేసుకుని ఈ చిత్రానికి ఈ పేరు పెట్టాం. కథానుగుణంగా చక్కగా కుదిరింది. చెన్నై, రాజమండ్రి, మలేషియా, జోధ్పూర్ తదితర ప్రాంతాలలో భిన్న మైన లొకేషన్స్లో చిత్రీకరణ జరిపాం. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అని తెలిపారు.
అలాగే ...నేను నిర్మించిన భారతీయుడు, ఒకే ఒక్కడు తరహాలోనే ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుందనే నమ్మకముంది. సత్యదేవా అనే ఓ పోలీస్ ఆఫీసర్ కథే ఈ చిత్ర ఇతివృత్తం. గతంలో అజిత్ నటించిన ప్రేమలేఖ చిత్రాన్ని తెలుగులో నేనే విడుదల చేశాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. సుధీర్ఘ విరామం తర్వాత ఆయనతో వరుసగా మూడు సినిమాల్ని చేయటం ఆనందంగా ఉంది. దర్శకుడు గౌతమ్మీనన్ సెంటిమెంట్, యాక్షన్ అంశాల మేళవింపుతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. హారీష్ జయ్రాజ్ చక్కటి బాణీలను అందించారు.
అరుణ్ విజయ్, వివేక్, సుమన్, పార్వతి నాయర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హారీస్ జైరాజ్, సినిమాటోగ్రఫీ: డాన్ మాకార్థుర్, ఎడిటింగ్: ఆంటోని, నిర్మాణ పర్యవేక్షణ: ఏ.ఎం.రత్నం.