Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
జనవరి 1 న : దర్శకుడు వంశీ చిత్రం రిలీజ్
హైదరాబాద్: "లేడీస్ టైలర్" , "అన్వేషణ", " ఏప్రిల్ 1 విడుదల" వంటి చిత్రాల దర్శకుడు వంశీ డైరక్ట్ చేస్తున్న తాజా చిత్రం జనవరి 1 న విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం టైటిల్ 'వెన్నెల్లో హాయ్ హాయ్' . చాలా కాలం క్రితం పూర్తై ...రిలీజ్ ఆగిపోయిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రంలో అజ్మల్ హీరోగానూ, నికితా నారాయణ్ హీరోయిన్ గానూ చేస్తున్నారు.
'వెన్నెల్లో హాయ్ హాయ్.. మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే...' అంటూ 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రంలో రవితేజ తెగ సందడి చేశారు. ఆ చిత్రానికి వంశీ దర్శకుడు. ఇప్పుడు ఆ పాటలోని తొలి పదాల్ని తన సినిమాకి టైటిల్గా పెట్టేశారు వంశీ. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రానికి 'వెన్నెల్లో హాయ్ హాయ్' పేరు పెట్టారు.
ఈ చిత్రానికి ఇది వరకు 'తను మొన్నే వెళ్లిపోయింది' అనే టైటిల్ పెట్టారు. ఆ తరవాత 'మెల్లగా తట్టింది మనసు తలుపు'గా మార్చారు. ఇప్పుడు మళ్లీ ఈ కొత్త పేరు వచ్చింది. జనవరి 1, 2016న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
చిత్రం కాన్సెప్టు ఏమిటంటే... ఎదుటివారికి సాయపడటంలోనే తన ఆనందాన్ని వెదుక్కొనే యువకుడు సుశీల్. చదువులు పూర్తి చేసుకొన్నాడు. అందుకే ఇంట్లోవాళ్లు ఓ పెళ్లి సంబంధం చూశారు. సిగ్గులు ఒలకబోస్తూ పెళ్లింట్లో అందంగా ముస్తాబై కూర్చుంది సత్య. కాబోయే దంపతులు ఇద్దరూ ఒకర్నొకరు చూసుకొన్నారు. మనసు విప్పి మాట్లాడుకొన్నారు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి ఓ అమ్మాయిని వెదికేందుకు ప్రయాణం కట్టారు. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఈ జంటకీ, ఆ అమ్మాయికీ మధ్య సంబంధమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''క్యాచీగా ఉండే టైటిల్ ఇది. కథకు కూడా అనువుగా ఉంటుంది. వంశీ తెరకెక్కించిన 25వ చిత్రమిది. ఆద్యంతం ఆయన శైలిలోనే హాయిగా సాగిపోతుంది''అన్నారు.
దర్శకుడు వంశీ మాట్లాడుతూ.. ''ఆహ్లాదభరితమైన ప్రేమ కథ. ఓ యువతి కోసం సుశీల్, సత్య సాగించే అన్వేషణ విధానం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది''అన్నారు.
అజ్మల్ గతంలో "రంగం","రచ్చ" వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు. తెలుగులో హీరోగా అజ్మల్ కి ఇదే మొదటి చిత్రం. ఈ చిత్రం ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. పూర్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి కెమెరా: ఎమ్వీ రఘు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: వేమూరి సత్యనారాయణ, ఎడిటింగ్: బస్వాపైడిరెడ్డి, సంగీతం: చక్రి.