ప్రగ్యా జైస్వాల్
ప్రగ్యా జైస్వాల్ బయోగ్రఫీ
ప్రగ్యా జైస్వాల్ భారతీయ చలనచిత్ర నటి మరియు మోడల్. తెలుగు మరియు హిందీ చిత్రాలలో నటించారు. జైస్వాల్ మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మిచంది. పూణే లోని సింబయాసిస్ లా స్కూల్ లో చదివింది. సింబయాసిస్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లో వివిధ రకాల అందాల పోటీలలో పాల్గొని విజయవంతమైన మోడగా ఎదిగింది.
2015 ఆమె తెలుగులో వచ్చిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించింది. ఆ తర్వాత ఓం నమో వేంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి చిత్రాలలో నటించింది.
సంబంధిత వార్తలు