twitter
    CelebsbredcrumbSaptagiribredcrumbBiography

    సప్తగిరి బయోగ్రఫీ

    సప్తగిరి ఒక తెలుగు సినీ హాస్యనటుడు. అతని అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. తర్వాత తన పేరును సప్తగిరి అని మార్చుకున్నాడు. అతని స్వస్థలం చిత్తూరు జిల్లా, పుంగనూరు. నటుడు కాక ముందు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. బొమ్మరిల్లు సినిమా దర్శకుడైన భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన పరుగు సినిమా అతనికి నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది. 


    ప్రేమకథా చిత్రమ్,వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలతో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకుని నటుడిగా స్థిరపడిపోయాడు. సప్తగిరి చాలా తక్కువ బడ్జెట్ కామెడీ సినిమాల్లో నటించాడు. డిసెంబరు 2016 లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా కథానాయకుడయ్యాడు.


    కందిరీగ, దరువు, నిప్పు, మంత్ర, గబ్బర్‌ సింగ్‌ లాంటి  హిట్ సినిమాల్లో నటించాడు. అదే సమయంలో దర్శకుడు మారుతి దర్శకత్వంలొ ఈ రోజుల్లో సినిమా అతి తక్కువ బడ్జెట్ లో విడుదలై మంచి విజయం సాధించింది. ఎ ఫిల్మ్ బై అరవింద్ సినిమాతొ సప్తగిరి, మారుతి కలిసి చాలా రోజులు పనిచేశారు. ఆ పరిచయంతో మారుతి తర్వాత తీస్తున్న ప్రేమకథా చిత్రమ్ లో అవకాశం కల్పించాడు. అందులో పాత్ర అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది.


    దీని తర్వాత దృశ్యం, మనం, పవర్, ఎక్స్ ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్ని నాయనా, మజ్ను తదితర చిత్రాల్లో నటించాడు. ఇలాగే ఇంకా మరెన్నో సిమాల్లో నటించి అందరిని మెప్పించాలని ఆశిస్తున్నాము.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X