Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ రీమేక్ లో చేయాలని అఖిల్ నిర్ణయం
హైదరాబాద్ : అక్కినేని వారసుడు అఖిల్ తన తొలి చిత్రం అఖిల్ డిజాస్టర్ అయ్యింది. దాంతో ఆయన తన తదుపరి చిత్రం విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రకరకాల కథలు విన్నా ఏదీ నచ్చటం లేదని సమాచారం. ఈ నేపధ్యంలో ఆయన ఓ హిందీ రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రీమేక్ అయితే సేఫ్ జోన్ లో హిట్ కొట్టవచ్చనే ఈ నిర్ణయానికి వచ్చాడంటున్నారు.
ఆ రీమేక్ కోసం ఎంచుకున్న చిత్రం మరేదో కాదు... రెండేళ్ల కిందట బాలీవుడ్లో హిట్ కొట్టిన 'యే జవానీ హై దివానీ' అని తెలుస్తోంది. ఈ సినిమా చాలా కాలం క్రితమే చూసినా అప్పట్లో తనకు బాగా నచ్చిందని, ఆ రీమేక్ తో నే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వమని ఆయన ఫ్రెండ్స్ అన్నారని,అయితే అది పట్టించుకోని అఖిల్ ఇప్పుడు అదే నిర్ణయం తీసుకుని హిట్ కొట్టబోతున్నట్లు చెప్తున్నారు.
ధర్మా ప్రొడక్షన్స్- అన్నపూర్ణ స్టూడియోస్ దీన్ని కంబైన్డ్గా తెరకెక్కించాలని ప్లాన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. కరుణ్ జోహార్ సైతం ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తి చూపెండుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాని వంశీపైడిపల్లి డైరెక్ట్ చేసే ఛాన్స్ వుంది. ప్రస్తుతం వంశీ పైడిపల్లి..నాగార్జున తో ఊపిరి చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం కూడా ప్రెంచ్ చిత్రం రీమేక్ కావటంతో నాగ్..ఈ నిర్ణయానికి వచ్చాడని చెప్తున్న్రారు.