Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
భర్తతో గొడవ పడిన హీరోయిన్ అమల పాల్
హైదరాబాద్: హీరోయిన్ అమలా పాల్ ఇటీవలే తమిళ దర్శకుడు విజయ్ ని మతాంతర వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అమలా పాల్ మళయాలీ క్రిస్టియన్ అయితే, విజయ్ తమిళ హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి. విజయ్ ఫ్యామిలీలో నాన్ వెజ్ తినే అలవాటు లేదట. అయితే అమలా పాల్కు మాత్రం నాన్ వెజ్ అంటే ప్రాణం.
ఇటీవల ఈ విషయంలో ఇద్దరి మధ్య చిన్న పాటి వాదన జరిగినట్లు తెలుస్తోంది. నాన్ వెజ్ మానేయాలని విజయ్ కోరగా....అమలా పాల్ తన వల్ల కాదని వాదించిందట. భార్యా భర్తలు అన్న తర్వాత ఇలాంటి చిన్న చిన్న గిల్లిగజ్జాలు సహజమే. అయినా వాళ్ల తిండి గొడవ మనకెందుకు లెండి!
భర్త సహకారం ఉండటంతో అమలా పాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతోంది. మరో వైపు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ చేతి నిండా సంపాదిస్తోంది. మలయాళ చిత్రం ‘మిల్లీ'తో పెళ్లి తర్వాత వెండితెరపై సరికొత్త ఇన్నింగ్స్ను ప్రారంభించింది. రాజేష్ పిళ్లై దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్ డీగ్లామర్ పాత్రను పోషించనుంది. పాత్రలో సహజత్వం కోసం మేకప్ లేకుండా ఈ చిత్రంలో నటించింది.
సినిమా కథాంశం విషయానికొస్తే....అందవిహీనంగా ఉన్నాననే భావనతో అసంతృప్తికరమైన జీవనాన్ని కొనసాగిస్తున్న ఓ మధ్యతరగతి యువతి ఎలా అందాలరాణిగా మారింది? తన జీవితాన్ని ఏ విధంగా ఆనందమయం చేసుకుంది? అనేది మెయిన్ స్టోరీ. ఇందులో ఆమెు పాత్ర విభిన్నంగా, ఆదర్శవంతంగా ఉంటుందని అంటున్నారు.
పెళ్లి తర్వాత సినిమాలకు కొంత విరామం ప్రకటించింది అమలాపాల్. ఆమె నటించిన చివరి సినిమా వేలైఇల్లా పట్టాధారి విడుదలై దాదాపు ఆరు నెలలయింది. దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ కెరీర్కు గుడ్బై చెప్పిందనే అంతా అనుకున్నారు.