Don't Miss!
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- News పొత్తుతో పవన్ ఆస్తులు పెరిగాయి - మనోహర్కి స్పోర్ట్స్ కారు..!!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
అనుష్క చేతికి గాయం (ఫొటో)
హైదరాబాద్ :ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది అనుష్క. 'రుద్రమదేవి', 'బాహుబలి', 'లింగా'తోపాటు అజిత్ సినిమాలు అనుష్క ఖాతాలో ఉన్నాయి. ఈ చిత్రాలలో ఏ షూటింగ్ లో దెబ్బ తగిలిందో కానీ ఆమె చేతికి గాయం అయ్యింది. రుద్రమదేవి షూటింగ్ లొకేషన్ లోని ఈ ఫొటో ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆమె రైట్ హ్యాండ్ కు బ్యాండ్ ఉన్న విషయం గమనిస్తే అది స్పష్టమవుతుంది. అయితే గాయం అయిందని కానీ, షూటింగ్ కు ఎక్కడా బ్రేక్ ఇవ్వకపోవటం, మీడియాలో దాన్ని ఫోకస్ కానివ్వకుండా ఆపటం అనుష్క డెడికేషన్ ని,సింపుల్ సిటీనీ చూపిస్తోంది అంటున్నారు ఆమె అభిమానులు.
ఇక అనుష్క పర్శనల్ జీవితానికి వస్తే... మంచి హీరోయిన్ గానే కాదు, మంచి కూతురిగానూ పేరు తెచ్చుకోవాలనుకొంటోంది అనుష్క. ఇంట్లోవాళ్ల ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే పని ఏదీ చేయనంటోంది.
అనుష్క మాట్లాడితే... ''నాకు మా ఇంట్లో ఎంతో స్వేచ్ఛనిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయను. నా జీవితానికి సంబంధించిన కీలకమైన విషయాల్లో వాళ్ల ప్రమేయం తప్పనిసరి. వాళ్లకు చెప్పకుండా ఒక్క అడుగు ముందుకు వేయను'' అంటోంది.
మరి ప్రేమ వ్యవహారంలోనూ పెద్దల అనుమతి తీసుకొంటారా అనడిగితే, ''ప్రేమిస్తే తప్పేంటి.. అదీ జీవితంలో భాగమే కదా. అలాంటప్పుడు పెద్దలకు చెప్పాల్సిందే. ప్రేమ, పెళ్లి ఇలాంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే ఇంట్లో చెప్పేస్తా. లేదంటే ఇంట్లోవాళ్లు చూసిన వ్యక్తినే నిరభ్యంతరంగా పెళ్లి చేసుకొంటా. ఈ విషయంలో మరో ఆలోచనకు తావు లేదు'' అని చెప్తోంది.
రుద్రమదేవి విషయానికి వస్తే...
అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'రుద్రమదేవి'. రానా ముఖ్య పాత్రధారి. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తనకే సాధ్యమైన రీతిలో ఎవరూ వంక పెట్టలేని విధంగా రూపొందించాలని గుణ శేఖర్ కష్టపడుతున్నారు. ఈ మేరకు ఖర్చు కూడా భారీగా పెడుతున్నారు. డిసెంబర్ 19న విడుదల చేస్తున్నారు.
దర్శుడు మాట్లాడుతూ... ''కాకతీయుల కాలం నాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా ఈ సెట్లు ఉండబోతున్నాయి. వీటి కోసం తోట తరణి 400 స్కెచ్లు వేశారు. నాటి సంప్రదాయలు, జీవన స్థితిగతులను ప్రతిబింబించేలా చిత్రబృందం ఎంతో శ్రమించి వీటికి రూపు తీసుకొస్తోంది. ఇప్పటికే కొన్ని సెట్లలో షూటింగ్ చేశాం. మిగిలిన వాటిలో త్వరలోనే చిత్రీకరణ జరుపుతాం'' అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'