Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'బాహుబలి' కొత్త పోస్టర్ సైతం...కాపీ అంటూ
హైదరాబాద్: 'ఆ గంగను మోసిన జంగమదేవుని నెత్తిన మోసినదెవడు...నరనరమున సత్తువ ఉరకలు వేసిన నరోత్తముడు ఎవడు' అంటూ రాజమౌళి తన తాజా చిత్రం బాహుబలి కొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ప్రభాస్, అనుష్క జంటగా... దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'బాహుబలి'(ద బిగినింగ్).
ఈ చిత్రానికి సంబంధించి హీరో ప్రభాస్ పోస్టర్ను ఈరోజు రాజమౌళి ట్విట్టర్లో పోస్టు చేశారు. భారీకాయుడైన ప్రభాస్ జలపాతం నడుమ భారీ శివలింగాన్ని భుజాలపై మోసుకువస్తున్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.
ఫేస్ బుక్, ట్విట్టర్ లల్లో యాక్టివ్గా ఉంటూ వార్తల్లో నిలిచే రాజమౌళి బాహుబలి విశేషాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. మే 1న విడుదల చేసిన పోస్టర్కు అద్భుతమైన స్పందన రావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు ప్రభాస్ పోస్టర్ను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
అయితే ఈ పోస్టర్ విడుదల చేసిన కాస్సేపటికే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఈ పోస్టర్ తమిళంలో వచ్చిన అర్జున్ చిత్రం పోస్టర్ నుంచి ప్రేరణ పొంది వదిలారంటూ విమర్శలు రావటం మొదలయ్యాయి. ఇక్కడ మీరు చూస్తున్న పోస్టర్ పెట్టి పోస్ట్ లు పెడుతున్నారు.
ఎప్పుడెప్పుడా అని 'బాహుబలి' కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. సినీ పరిశ్రమ సైతం ఆ సినిమా విడుదలపై ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తోంది. అయితే త్వరలోనే 'బాహుబలి' సందడి షురూ కాబోతోంది. చిత్రాన్ని జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రకటించారు. మే 31న ట్రైలర్ని విడుదల చేస్తున్నామని ఆయన తెలియజేశారు.
మే1 నుంచి ఒక్కో ప్రధాన పాత్రకు సంబంధించి ప్రచార చిత్రాల్ని విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. దీని సంబంధించి రాజమౌళి ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ''సినిమాని మే 15న విడుదల చేస్తున్నామని ఇది వరకు నేనే చెప్పా. అయితే నిర్మాణానంతర పనులు పూర్తి కాకపోవడంతో అది కుదరలేదు. ట్రైలర్ను పక్కాగా మే 31న విడుదల చేస్తాం'' అని ఆ వీడియోలో చెప్పారు రాజమౌళి.
విజువల్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యమున్న ఈ చిత్రం కోసం రాజమౌళి బృందం రేయింబవళ్లు కష్టపడుతోంది. 17 వీఎఫ్ఎక్స్ స్టూడియోల్లో 600 మంది సాంకేతిక నిపుణులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారనీ, అయినా అనుకొన్న సమయానికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయామని ట్విట్టర్లో రాసుకొచ్చారు రాజమౌళి. రూ.200 కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించారు.
అనుష్క, తమన్నా హీరోయిన్స్. రానా ముఖ్యభూమిక పోషించారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్' పేరుతో విడుదల కానుంది. ప్రభాస్ కూడా ఫేస్బుక్ ద్వారా 31న ట్రైలర్ను విడుదల చేస్తున్నామని ప్రకటించారు.