Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలయ్య కామెంట్స్... జూ ఎన్టీఆర్పైనే అంటున్నారు?
హైదరాబాద్: ‘లయన్' మూవీ ఆడియో వేడుకలో బాలయ్య చేసిన వ్యాఖ్యఖ్యల ఇపుడు నందమూరి అభిమానుల సర్కిల్ లో చర్చనీయాంశం అయింది. ‘బాలయ్యతో పెట్టుకుంటే ఎవరైనా అంతే.. చిట్టెలుకలూ, చిరుత పులులూ మనతో పెట్టుకుంటే మాడి మసైపోతాయి' అంటూ బాలయ్య అభిమాను సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేసారు.
బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ గురించే అని అంటున్నారు. నందమూరి అభిమానులు ఇటు బాలయ్యను ఎంత అభిమానిస్తారో అటు జూ ఎన్టీఆర్ ను అదే స్థాయిలో అభిమానిస్తారు. అయితే ఇద్దరి మధ్య దూరం ఎందుకు పెరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నరు అభిమానులు. ఆ మధ్య బాలయ్య కూతురు వివాహానికి కూడా జూ ఎన్టీఆర్ హాజరు కాలేదు.
సోషల్ మీడియాలో ఈ విషయమై తీవ్రమైన చర్చ సాగుతోంది. భవిష్యత్తులో నందమూరి కుటుంబీకుల మధ్య విబేధాలు తొలగాలని, నందమూరి హీరోలు ఐక్యంగా ముందుకు సాగాలని, తెలుగు సినిమా పరిశ్రమలో తమ అభిమాన హీరోల హవా కొనసాగాలని కోరుకుంటున్నారు.