Don't Miss!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- News ఏపీలో ఇప్పటివరకు భారీగా పట్టుబడిన నగదు, మద్యం, బంగారం.. అత్యధికంగా ఎక్కడంటే
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హాట్ న్యూస్ :బాలకృష్ణ కొత్త చిత్రానికి టైటిల్ దొరికింది
హైదరాబాద్ : బాలకృష్ణ తాజా చిత్రానికి గాడ్సే అనే టైటిల్ పెడదామని నెగిటివ్ టైటిల్ అవుతుందని ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారియర్ అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే బాలయ్య ఆసక్తి చూపించలేదని చెప్పుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య కొత్త చిత్రానికి , 'లయిన్' అని పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది. సింహా సూపర్ హిట్టవటంతో అదే పవర్ గల టైటిల్ ని వెతికి ఇది ఫైనల్ చేసే అవకాసం ఉందని అంటోంది. 'లెజండ్' టైటిల్ సైతం ల తో ప్రారంభం కావటం అదీ ఘన విజయం సాధించటం తో ఈ టైటిల్ పైనే దర్శక,నిర్మాతలు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక బాలకృష్ణ నిర్ణయంతీసుకోవటమే మిగిలిందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్ గా చేస్తున్నారు. బాలకృష్ణ, త్రిష జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా సత్యదేవ్ దర్శకుడు గా పరిచయం అవుతున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత.ఈ చిత్రంలో బాలయ్యలో రెండు కోణాలుంటాయని తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
''ప్రజల క్షేమాన్ని కోరుకునే ఓ ఉన్నత ఉద్యోగి జీవితమిది. నాయకుడంటే ఇలా ఉండాలనేలా బాలకృష్ణ పాత్రను సత్యదేవా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి'' అంటున్నారు నిర్మాత.
ఈ చిత్రంలో బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.
ఈ చిత్రంలో ప్రకాష్రాజ్, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్ తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకట్ప్రసాద్, కూర్పు: గౌతంరాజు