Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పద్మశ్రీ లేదా పద్మ భూషణ్... ఈ సారి బాలయ్యకు?
హైదరాబాద్: వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలు అందించిన ఆయా రంగాలకు చెందిన ప్రముఖులకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సినీరంగానికి చెందిన వ్యక్తులు కూడా ఉంటారు. ఇప్పటికే తెలుగు నుండి అనేక మంది ప్రముఖులు పద్మవిభూషన్, పద్మ భూషన్, పద్మశ్రీ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు.
ఈ సారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డుల లిస్టులో.....తెలుగు సినీ రంగం నుండి ప్రముఖ సీనియర్ సినీ నటుడు, గత కొన్నేళ్లు తెలుగు సినీ రంగానికి ఎనలేని సేవ చేస్తున్న నందమూరి బాలయ్య పేరు ఉండటం ఖాయమనే అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పలువురి ప్రముఖుల పేర్లతో సిఫారసు లిస్టులను రెడీ చేసినట్లు తెలుస్తోంది.
బాలకృష్ణకు పద్మశ్రీ లేదా పద్మభూషణ్ దక్కడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఇక పద్మభూషణ్ కోసం మరో నటుడు మురళీమోహన్ పేరు వినిపిస్తున్నా పార్లమెంట్ సభ్యుడి హోదాలో ఉండటం వలన ఇవ్వడం సాధ్యంకాదని, ఎన్టీఆర్కు ఇపుడు భారతరత్న వీలుకాకుంటే, బాలకృష్ణకు పద్మ అవార్డు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.