Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నిజమా? బాలయ్య ‘మే’డే గిఫ్టు ఇస్తున్నారా?
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సత్య దేవ దర్శకత్వంలో ‘లయన్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత ఈ చిత్రం ఆడియో రిలీజ్ మార్చి 28 విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు. అయితే ఏపీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించేందుకు ఏప్రిల్ 9కి వాయిదా వేసినట్లు సమాచారం. శిల్పకళా వేదికలో ఆడియో వేడుక ఘనంగా జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైనట్లు చెబుతున్నారు. మే 1వ తేదీన కార్మిక దినోత్సవం సందర్భంగా సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది. ఈచిత్రం బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
బాలయ్య సరసన తొలిసారి త్రిష ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్నారు. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత, దర్శకత్వం: సత్యదేవా.