Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లెక్కల సంగతేంటీ.. క్రిష్పై బాలయ్య అసహనం
ఖైదీ నంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాల మధ్య పోటీ రిలీజ్ తర్వాత సద్దుమణగడం లేదనే విషయం స్పష్టమవుతున్నది. కలెక్షన్ల పరంగా వీరిద్దరి మధ్య వివాదం తలెత్తినట్టు తెలుస్తున్నది.
ఖైదీ నంబర్ 150 చిత్రం తొలివారంలోనే వంద కోట్ల క్లబ్లో చేరిందటూ అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి ఢంకా భజాయించేశారు. ఈ వ్యవహరం గౌతమి పుత్ర శాతకర్ణి హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ల మధ్య వివాదంగా మారినట్టు ఫిలింనగర్ టాక్. అల్లు అరవింద్ ప్రకటించినట్టుగానే శాతకర్ణి కలెక్షన్లను ఎందుకు ప్రకటించలేదని క్రిష్ ను బాలయ్య నిలదీసినట్టు ఓ వార్త ప్రచారం జరుగుతున్నది. శాతకర్ణి కలెక్షన్లను వెల్లడించకపోవడంపై బాలయ్య తీవ్ర అసహనంతో ఉన్నట్టు సమాచారం.
దీంతో ఖైదీ నంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాల మధ్య పోటీ రిలీజ్ తర్వాత సద్దుమణగడం లేదనే విషయం స్పష్టమవుతున్నది. సంక్రాంతి రేసులో నందమూరి బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలు నువ్వా నేనా అన్నట్టుగా విడుదలైన సంగతి తెలిసిందే. చిరంజీవి రీఎంట్రీ మూవీగా విడుదలైన ఖైదీ నంబర్ 150కి అభిమానులు, ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నది. గౌతమిపుత్ర శాతకర్ణి కూడా విమర్శల ప్రశంసలందుకొని కలెక్షన్లను కొల్లగొట్టింది. కాగా శాతకర్ణి పంపిణీదారులు, చిత్ర నిర్మాతల కార్యాలయాలపై మంగళవారం ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.