Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘ఆగడు’ ఎఫెక్ట్: నిర్మాతల మధ్య చీలిక?
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా ‘ఆగడు' చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కించిన నిర్మాతల మధ్య చీలిక ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ బేనర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. నమో వెంకటేశ నుండి మొదలై దూకుడు, 1 నేనొక్కడ్నే, లెజెండ్, ఆగడు వరకు వీరి ప్రయాణం సాగింది.
అయితే...‘ఆగడు' సినిమా సమయంలో ఏర్పడ్డ విబేధాలు నిర్మాతల మధ్య చీలికకు కారణమైంది, తన స్నేహితులైన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటల నుండి వేరుపడి అనిల్ సుంకర వేరు కుంపటి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే విబేధాలకు కారణం ఏమిటనేది తెలియరాలేదు.
సునీల్
హీరోగా
అనిల్
సుంకర
సినిమా...
అనిల్
సుంకర
త్వరలో
నిర్మించబోయే
సినిమా
ద్వారా
ప్రముఖ
స్క్రీన్
ప్లే
రైటర్
గోపీ
మోహన్
త్వరలో
దర్శకుడిగా
పరిచయం
కాబోతున్నారు.
ఢీ,
రెడీ,
దుబాయ్
శీను,
సంతోషం,
వెంకీ,
కింగ్,
నమో
వెంకటేశ
తదితర
హిట్
చిత్రాలకు
రచయితగా
పని
చేసిన
గోపీ
మోహన్
సునీల్
హీరోగా
సినిమా
ప్లాన్
చేస్తున్నారు.
ఇక అన్నదమ్ములైన రామ్ ఆచంట్, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాని హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.