Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చిరంజీవి మందలింపు, అందుకే అల్లు అర్జున్ ఇలా?
హైదరాబాద్: పవన్ ఫ్యాన్స్ విషయమై జరుగుతున్న వివాదానికి అల్లు అర్జున్ ..ఒక మనస్సు ఆడియో ఫంక్షన్ లో ఫుల్ స్టాఫ్ పెట్టడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ స్టేజిపై మాట్లాడటానికి కారణం చిరంజీవి చెప్పిన జాగ్రత్తలు, సూచనలే కారణం అని మీడియాలో బలంగా వినిపిస్తోంది.
అభిమానులు అనేవారు..ఏ ఆర్టిస్టు కైనా చాలా ముఖ్యమనే విషయాన్ని చిరంజీవి..స్వయంగా అల్లు అర్జున్ కు బ్రీఫ్ చేసి, వారు లేకపోతే మనం లేమంటూ హెచ్చరించారని, అందుకే ఈ వివాదానికి ఫుల్ స్టాఫ్ పెట్టాలని బన్ని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు.
ఓ లీడింగ్ ఇంగ్లీష్ పేపరు కథనం ప్రకారం... చిరంజీవి..బుధవారం అల్లు అర్జున్ ని పిలిచి చాలా సేపు మాట్లాడారట. ఓపిక పట్టాలని, చాలా విషయాల్లో సహనంతో ఉండాలని చెప్పారని హిత భోధ చేసారట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి నీకేంటి ప్లాబ్లం అంటూ మందలించారట.
అంతేకాకుండా నేను నీ బిహేవిరయర్ గురించి మొన్న వైజాగ్ లో మాట్లాడాను, ఎంతో మెచ్యూరిటీ వచ్చిందని పొగిడాను. ఇంతలోనే ఈ వివాదం లో ఇరుక్కున్నావేంటి అంటూ బాధగా అల్లు అర్జున్ తో అన్నారట. దాంతో నీహారిక చిత్రం ఒక మనస్సు ఆడియో పంక్షన్ లో...క్లారిటీతో మాట్లాడి, ఫుల్ స్టాఫ్ పెట్టాడని చెప్తున్నారు.