Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రామ్ చరణ్కి చిరంజీవి వార్నింగ్!
హైదరాబాద్: తమిళ హిట్ మూవీ ‘థాని ఒరువన్' చిత్రాన్ని రామ్ చరణ్ తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. రామ్ చరణే స్వయంగా ఈ చిత్రం రీమేక్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
అయితే తమిళ వెర్షన్ ఉన్నది ఉన్నట్లుగా తీయకుండా కొన్ని మార్పులు చేసి రామ్ చరణ్ ఇమేజ్ కు తగిన విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలని దర్శకుడు సురేందర్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవికి చెప్పగా.... అలా చేయొద్దు అంటూ హెచ్చరించినట్లు సమాచారం.
కాగా... తమిళంలో విలన్ పాత్ర పోషించిన అరవింద స్వామి తెలుగులో కూడా నటించనున్నాడు. తెలుగులో నటించడానికి అరవింద స్వామి రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ అడుగుతున్నాడట. తెలుగులో ఆయన పాత్ర కీలకం కావడంతో ఆయన అడిగిన మొత్తం ఇచ్చేందుకు ఓకే చెప్పారట.
రామ్ చరణ్ ‘బ్రూస్ లీ' సినిమా ఫలితంతో రూటు మార్చాడు. ఈ సినిమాకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకూడదని, కేవలం సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభాల్లో షేరింగ్ మాత్రమే తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడట. ఇలా చేయడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుందని, సినిమాను నష్టాల భారి నుండి తప్పించవచ్చని అంటున్నాడు.