Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
దేవిశ్రీప్రసాద్ హీరో చేస్తున్న చిత్రం టైటిల్ ఇదే ?
హైదరాబాద్ : సుకుమార్ ప్రొత్సహించడంతో హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దేవిశ్రీప్రసాద్. దాంతో దిల్ రాజు నిర్మాతగా సుకుమార్ డైరెక్షన్లో దేవిశ్రీ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు కూడా. దీంతో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలపై ఆసక్తి పెరిగిపోయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేయనున్నారు, కథ ఏంటి..టైటిల్ ఏం పెట్టబోతున్నారనే విషయంపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం టైటిల్ రాక్ స్టార్ అంటూ ప్రచారం వెబ్ మీడియాలో మొదలైంది.
ఇక సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న దేవిశ్రీప్రసాద్ను హీరోగా పరిచయం చేయాలని చాలా రోజులుగా దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. కుమారి 21 ఎఫ్ చిత్ర సక్సెమీట్లో దేవిశ్రీప్రసాద్ను హీరోగా పరిచయం చేస్తున్నానని ప్రకటించాడు దిల్రాజు.
దిల్ రాజు మాట్లాడుతూ....ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో నేను నటించదగ్గ కథ కుదిరితే హీరోగా నటిస్తానని దేవి చెప్పాడు. అందుకే అతన్ని మా సంస్థ ద్వారా హీరోగా పరిచయం చేయబోతున్నాను. 12 ఏళ్ల క్రితం ఆర్యతో ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ని అందించిన అదే టీమ్తో ఈ సినిమా చేయబోతున్నాను. సుకుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తారు అని తెలిపారు.
దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ నిర్మాతల్లో శిఖరం లాంటి వ్యక్తి దిల్ రాజు, దర్శకుల్లో శిఖరం సుకుమార్, కెమెరామెన్ లలో శిఖరం రత్నవేలు. ఈ ముగ్గురు నన్ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తామని చెప్పడం ఆనందంగా వుంది అన్నారు.