Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
లక్ష ఖర్చు పెడితే పవన్ కళ్యాణ్తో డిన్నర్!?
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చే అభిమానులు ఎంత మంది ఉన్నారో లెక్క చెప్పడం కాస్త కష్టమే. టాలీవుడ్లో ప్రస్తుతం ఆయన నెం.1 హీరో. ఆయన్ను చూస్తే చాలు, కలిస్తే చాలు అని ఉబలాట పడే ఫ్యాన్స్ ఎందరో. అలాంటి ఆయనతో కలిసి ఏకంగా భోజనం చేస్తూ మాట్లాడే అవకాశం వస్తే అభిమానులకు పండగే.
ఈ నెల 29న హైదరాబాద్లోని జేఆర్సి కన్వెన్షన్ సెంటర్లో ‘డిన్నర్ విత్ స్టార్స్' పేరుతో టాలీవుడ్ పరిశ్రమకు చెందిన వారు ఓ కార్యక్రమం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా వచ్చిన డబ్బును హుధూద్ తుఫాను కోసం అందజేసే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారట. ఈ కార్యక్రమానికి పలువురు స్టార్స్ను ఆహ్వానించనున్నారట.
ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ పిలిచే ఉద్దేశ్యంలో ఉన్నారట. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో స్టార్స్తో కలిసి డిన్నర్ చేయడం, వారితో ఫోటోలు దిగడం, వారితో మాట్లాడటం లాంటివి కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ‘డిన్నర్ విత్ స్టార్స్' కార్యక్రమం టికెట్ ధర దాదాపు లక్ష వరకు ఉండొచ్చని అంటున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ వస్తే అభిమానులు అంత మొత్తం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండటమే ఇందుకు కారణం.
ఒక మంచి కార్యక్రమం కోసం జరుగుతున్న ఫ్రొగ్రాం కావడంతో సినీ అభిమానుల నుండి మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. అయితే 30వ తేదీ ‘మేము సైతం' కార్యక్రమం ఉండటంతో ‘డిన్నర్ విత్ స్టార్స్' అసలు ఉంటుందా? ఉండదా? అనేదిపై ఇంకా క్లారిటీ రాలేదు.