twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గబ్బర్‌ సింగ్‌ 2' కొత్త విశేషాలు

    By Srikanya
    |

    Gabbar Singh-2 is 70 Crores
    హైదరాబాద్: 'నాక్కొంచెం తిక్కుంది...' అంటూ గబ్బర్‌ సింగ్‌గా పవన్‌ కల్యాణ్‌ చేసిన హంగామా ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. ఇప్పుడు 'గబ్బర్‌ సింగ్‌'కి రెండో భాగం రూపుదిద్దుకోబోతోంది. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 70 కోట్లు అని తెలుస్తోంది.

    ఈరోస్ వారు ఈ చిత్రం సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ బడ్జెట్ ని పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ ని ఈ చిత్రంలోకి తీసుకురావటానికి ఈరోస్ వారు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

    సంపత్ నంది మాట్లాడుతూ... ''గబ్బర్‌ సింగ్‌ సీక్వెల్‌ అంటే ప్రేక్షకులు ఎలాంటి అంశాలు ఆశిస్తారో తెలుసు. అవన్నీ మేళవించి ఈ కథను తయారు చేశాం. స్క్రిప్టు పక్కాగా పూర్తయింది. హీరోయిన్, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాం'' అని సంపత్‌నంది చెబుతున్నారు. ఇక ఈ చిత్రం అఫీషియల్ గా లాంచ్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

    'రచ్చ'తో ఆకట్టుకున్న సంపత్‌.. ఆ తరవాత చేస్తున్న చిత్రమిదే. శరత్‌ మరార్‌ నిర్మాత. గబ్బర్ సింగ్-2 చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. తొలిసారి సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న తన స్నేహితుడికి మేలు జరుగాలనే ఉద్దేశ్యంతోనే ఈ సీక్వెల్ నిర్ణయం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా ఉంది.

    English summary
    Buzz is that the movie’s budget has shot up to Rs 70 Crore. And if all goes well according to plan, Gabbar Singh 2 will go onto floors from October.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X