Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
లాభాలు రాకున్నా....రామ్ చరణ్ మూవీని అలా?
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం ఎలాంటి ఫలితాలు సాధించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఫ్యామిలీ ఎంటర్టెనర్గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో వచ్చింది. అయితే అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సినిమా లాభాలు రాక పోగా...రామ్ చరణ్ కూడా తన రెమ్యూనరేషన్ కొంత నిర్మాత బండ్ల గణేష్కు తిరిగి ఇచ్చేసాడని అప్పట్లో టాక్.
ఇలాంటి సినిమాను ఇపుడు హిందీలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ ఆలోచన వచ్చింది మరెవరికో కాదు.... రీమేక్ చిత్రాల దర్శకడు ప్రభుదేవాకే నంట. ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రభుదేవా చూసాడని, అతనికి నచ్చడంతో హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రామ్ చరణ్ తర్వాతి సినిమా విషయానికొస్తే...అతను త్వరలో శ్రీను వైట్ల చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే రామ్ చరణ్ తో ఆమె చేస్తున్న తొలి సినిమా ఇదే కానుంది. సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని టాక్.
సినిమాకు సంబంధించిన పేపర్ వర్క్ కంప్లీట్ కావాల్సి ఉందని, జనవరి సెకండ్ వీక్ లో సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో వైపు ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ విషయమై ఇప్పటి వరకు అటు రామ్ చరణ్ నుండి గానీ, ఇటు శ్రీను వైట్ల నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలోని ‘మన భారతంలో పాండవులు, కౌరవులు రాజాలు రా' అనే సాంగ్ నుండి ఈ మూవీ టైటిల్ స్వీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే టైటిల్ ఫైనల్ చేస్తారా? లేక మరేదైనా టైటిల్ పరిశీలిస్తారా? అనేదానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ చిత్రం ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది.
ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. సెకండ్ హీరోయిన్ గా రెజీనాగానీ, పూజా హెడ్గేను గానీ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి.
రామ్ చరణ్ నటించిన చివరి చిత్రం ‘గోవిందుడు అందరి వాడేలే'. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అభిమానులు ఆయన తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా ఉండాలని కోరుకుంటున్నారు.