Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
త్రివిక్రమ్ ఐడియా బాగుంది: వర్కవుట్ అవుతుందా ?
హైదరాబాద్ : బాలీవుడ్ లో ఎప్పుడో స్టార్ట్ అయి, ఊపందుకున్న జానర్ మల్టిస్టారర్. తెలుగులో ఆ జానర్ అప్పుడప్పుడూ పలకరిస్తోంది. మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో సీతమవాకిట్లో సిరిమల్లె చెట్టు, వెంకటేష్, పవన్ కాంబినేషన్ లో గోపాల గోపాల ఇలా..అప్పుడప్పుడూ ఈ మల్టిస్టారర్ లు వస్తున్నాయి. అదే కోవలో ఇప్పుడు మరో మల్టి స్టారర్ ప్రారంభమవటానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం.
బిజినెస్, క్రేజ్ పరంగా మల్టీస్టారర్ చిత్రాల అవసరాన్ని టాలివుడ్ ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. ఇమేజ్ని పక్కన పెట్టి నటించడానికి హీరోలు సిద్ధంగానే ఉన్నారు. దాంతో ఉత్సాహంగా దర్శకులూ కథలు రెడీ చేసుకొంటున్నారు. తాజాగా మరో ఇద్దరు హీరోలు కలసి ఓ సినిమాలో నటించే అవకాశాలున్నాయని టాక్. ఆ హీరోలు మరెవరో కాదు అల్లు అర్జున్, నాగార్జున.
వీరి కాంబినేషన్ కోసం ప్రముఖ దర్శక,రచయిత త్రివిక్రమ్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ...అల్లుఅర్జున్ కోసం త్రివిక్రమ్ ఓ కథ రెడీ చేశారట. అందులో ఓ కీలకమైన పాత్ర ఉందట. దాన్ని మోహన్ లాల్ వంటివారితో చేయించాలని భావించారట. అయితే తెలుగు స్టార్ అయితే మరింత క్రేజ్ ఉంటుందని భావించి నాగార్జునను ఎప్రోచ్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ‘అఆ'తో బిజీగా ఉన్నారు త్రివిక్రమ్. వేసవికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ తరవాత సూర్యతో ఓ సినిమా చేయాల్సివుంది. మధ్యలో మూడు నెలలకు మించి విరామం వస్తే.. వెంటనే ఈ ప్రాజెక్టుని సెట్ చేయాలని భావిస్తున్నారని చెప్పుకుంటన్నారు. అల్లు అర్జున్ సైతం లింగు సామితో ఓ ప్రాజెక్టు అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు అనంతరం ఈ సినిమాని లాగేస్తారు.