Don't Miss!
- News అప్పుడు వైసీపీ..ఇప్పుడు టీడీపీ.. యంగ్ హీరో ఇలా మారిపోయాడేంటి..!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘ఊపిరి’ దర్శక నిర్మాతలు అతన్ని మోసం చేసారా?
హైదరాబాద్: నాగార్జున-కార్తి ప్రధాన పాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి సినిమాస్ వారు తెరకెక్కించిన 'ఊపిరి' సినిమా గురించి ఓ గాసిప్ ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. ఊపిరి దర్శక నిర్మాతలు ఓ నటుడిని మోసం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
తెలుగు సీనియర్ నటుల్లో ఒకరైన రాజారవీంద్ర అందరికీ సుపరిచితమే. రాజా రవీంద్ర 'ఊపిరి' టైటిల్ను ఎప్పుడో రిజిస్టర్ చేసి పెట్టుకున్నాడు. 'ఊపిరి' టైటిల్ తమకు ఇచ్చినట్టయితే సినిమాలో ఓ మంచి పాత్ర ఇస్తామని అతగాడికి ఆశ పెట్టినట్లు సమాచారం.
నాగార్జున లాంటి పెద్ద హీరో సినిమా కావడంతో 'ఊపిరి' సినిమా టైటిల్ వారికి ఎలాంటి డబ్బు తీసుకోకుండా వారికి ఇచ్చేసాడు. వారు చెప్పినట్లే రాజారవీంద్రకి సినిమాలో ఓ పాత్ర ఇచ్చారు. అదీ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర. సినిమాలో ఆయన కనిపించేది ఒక్క నిమిషం కూడా ఉండదు, ఆయన పాత్రకు ఉన్న డైలాగ్ కూడా ఒకే ఒక్కటి.
దీంతో రాజారవీంద్ర తన సన్నిహితుల వద్ద ఈ విషయమై చాలా బాధపుతున్నట్లు సమాచారం. ఒకరకంగా తాను మోస పోయానని, తనకు సినిమాలో మంచి పాత్ర వస్తుందని ఆశించాను. కానీ అలా జరుగలేదు అంటూ బాధ పడుతున్నాడట.
'ఊపిరి' సినిమా విషయానికొస్తే.... విడుదలైన అన్ని చోట్లా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెలుతోంది. ఈ చిత్రం ఆల్రెడీ ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్ మార్కును అందుకుంది.