Don't Miss!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Sports CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు
- News చంద్రబాబు, రేవంత్ రెడ్డి మరోమారు కుమ్మక్కు: ఓటుకు నోటు కేసుపై ఎమ్మెల్యే ఆర్కే సంచలనం
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రాజ్ తరుణ్ అన్ని తప్పులు చేశాడా?.. దాని ఫలితమే..
‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్త మావా’, ‘కుమారి 21ఎఫ్’ లాంటి విజయాలతో టాలీవుడ్ లో ఓ రేంజ్ కు చేరుకొన్న ఈ యువ హీరో వేసిన తప్పటడుల వల్లే విజయాలు దూరమయ్యాయనే టాక్ వినిపిస్తున్నది.
సినీ పరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకొంటేనే అగ్రస్థానం దక్కుతుందనే విషయం అందరికి తెలిసిందే. 'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావా', 'కుమారి 21ఎఫ్' లాంటి విజయాలతో టాలీవుడ్ లో ఓ రేంజ్ కు చేరుకొన్న ఈ యువ హీరో వేసిన తప్పటడుల వల్లే విజయాలు దూరమయ్యాయనే టాక్ వినిపిస్తున్నది. రాజ్ తరుణ్ జడ్జిమెంట్ సరిగా లేకపోవడంతో 'ఆడోరకం ఈడోరకం'లాంటి చిత్రాల్లో నటిస్తున్నాడనే రూమర్ ప్రచారం జరుగుతున్నది.
ఇటీవల రాజ్ తరుణ్ వదులుకొన్న చిత్రాలు టాలీవుడ్ ఘన విజయాలు సాధించడమే కాకుండా భారీ కలెక్షన్లను వసూలు చేశాయి. ఈ మధ్య రాజ్ తరుణ్ చేజార్చుకొన్న చిత్రాలు శతమానం భవిత, నేను లోకల్ చిత్రాలు కావడం గమనార్హం. తొలుత శతమానం భవతి కథను శర్వానంద్, సాయిధరమ్ తేజ్ కంటే ముందుగా రాజ్ తరుణ్ కే వినిపించారట. అయితే కథలో కొన్ని మార్పులు చేయాలని సూచించడంతో ఆ చిత్రం చేసే అవకాశం శర్వానంద్ కు చిక్కింది. శర్వానంద్ పేరును దిల్ రాజుకు సాయి ధరమ్ తేజ్ సూచించాడట.
ఇక నాని హీరోగా ఇటీవల విడుదలైన 'నేను లోకల్' కూడా రాజ్తరుణ్ చేయాల్సిందే. ఈ సినిమా ఈ చిత్రం టాలీవుడ్ లోనే కాకుండా అమెరికాలో భారీ వసూళ్లు సాధించింది. ఈ రెండు చిత్రాలు రాజ్తరుణ్ ఖాతాలో పడి ఉంటే.. అతని కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయి ఉండేదని సినీ క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు.