Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ కు కోపం వెళ్లిపోబోయాడు, కానీ సమంత సారి చెప్పి...
హైదరాబాద్: ఎన్టీఆర్, సమంత కాంబినేషన్ లో ఇప్పటివరకూ బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస,జనతాగ్యారేజ్ అంటూ నాలుగు చిత్రాలు వచ్చాయి. దాంతో వారిద్దరి మధ్యా మంచి అనుబంధమే ఉంది. తాజాగా వచ్చిన జనతాగ్యారేజ్ చిత్రం ప్రమోషన్స్ లో మాత్రం సమంత ఎన్టీఆర్ కు కోపం తెప్చించింది. అయితే ఎన్టీఆర్ కు ఎందుకు కోపం వచ్చిందంటారా...అయితే ఈ కథనం చదవండి.
జనతాగ్యారేజ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్, దర్శకుడు కొరటాల శివ ప్రత్యేక ఇంటర్వూలు ఇస్తున్నారు. రీసెంట్ గా ఇదే పనిలో ఓ టీవి ఛానెల్ లైవ్ ఇంటర్వూకు వెళ్లారు. అయితే అదే సమయంలో ఎన్టీఆర్ కు సమంత కోపం తెప్పించింది. ఎందుకంటే సమంత చాలా లేటుగా వచ్చింది. ఈ ఇంటర్వూ సమంత, కొరటాల, ఎన్టీఆర్ తో కలిసి చేసారు.
లైవ్ షో కు సమయానికి ముందే ఎన్టీఆర్, కొరటాల వచ్చారచు. కానీ వీళ్లిద్దరూ వచ్చిన నలభై ఐదు నిముషాలకు గానీ సమంత రాలేదు. సమంత కోసం దాదాపు నలభై నిముషాలకు పైగా వెయిట్ చేసిన ఎన్టీఆర్ ,...విసుగెత్తి ఓపిక నశించడంతో ఎన్టీఆర్ లేచి వెళ్దామని ఫిక్స్ అయ్యారు. కరెక్ట్ గా అప్పుడే
సమంత వచ్చింది.
ఇక సమంత ను చూసిన వెంటనే ఎన్టీఆర్ కోపం వచ్చింది. ఆమెపై కోపంగా ఫైర్ అవ్వబోయారు. లేచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడు. ఈలోగా విషయం గమనించిన సమంత వెంటనే సారి చెప్పింది. అంతేకాకుండా తన లేటుకు కారణం చెప్పింది. ఆ కారణం చెప్పిన వెంటనే ఎన్టీఆర్ కూల్ అయ్యారు.
సమంత చెప్పిన విషయం ఏమిటి అంటే...తాను ఓ ఛారిటి పోగ్రామ్ కు వెళ్లటం వెల్లనే లేట్ అయ్యిందని సమంత చెప్పింది. దాంతో ఎన్టీఆర్ కూల్ అయ్యి..ఆమెను మెచ్చుకుని ఇంటర్వూలో కూర్చున్నట్లు తెలిసింది. అదీ విషయం.