Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అంత సీన్ లేదు...ఎన్టీఆర్ ఖచ్చితంగా వస్తాడు
హైదరాబాద్: అదేంటో ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ మూవి పై మొదటి నుంచి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. దానిక తోడు మీడియాలో ప్రతీసారి సినిమా ఇక ఆగిపోయినట్లే అని వార్తలు వస్తూనే ఉన్నాయి. అదే రూటులో ఈ సారి ఎన్టీఆర్ సినిమాకు టాలీవుడ్ లో జరుగుతున్న స్ట్రైక్ దెబ్బ తగిలిందని, కాబట్టి అనుకున్న సమయానికి అంటే సంక్రాంతికి విడుదల కాకపోవచ్చు అంటూ వార్తలు మొదలయ్యాయి. అయితే పూరి ప్రామిస్ చేసినట్లుగా అంటే జనవరి 9, 2015న ఖచ్చితంగా ఈ చిత్రం విడుదల అవుతుందని అంటున్నారు.
రీసెంట్ గా గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన ఈ చిత్రం యూనిట్ ఈ సమ్మెతో వెనకబడేదేమీ లేదని అంటున్నారు. ఎన్టీఆర్ రెస్ట్ లెస్ గా పనిచేయాలని నిర్ణయించుకునే ఈ విడుదల తేదీని ఫిక్స్ చేసాడని అంటున్నారు. అలాగే పూరి జగన్నాథ్ సైతం స్పీడుగా సినిమాలు తీయటంలో దిట్ట కావటంతో అనుకున్న సమయానికి ఆగటం అనే సమస్య లేదని, ఆలస్యం ఎట్టి పరిస్ధితుల్లోనూ కాదని అంటున్నారు. రెండు మూడు రోజుల్లో స్ట్రైక్ ఆగుతుంది కాబట్టి మళ్ళీ శరవేగంతో షూటింగ్ జరుగుతుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి.
నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ ‘‘ఈ రెండో షెడ్యూల్తో సినిమా మొత్తాన్ని పూర్తి చేస్తాం. హైదరాబాద్, వైజాగ్తో పాటు విదేశాల్లోనూ చిత్రీకరణ జరుపుతాం. జనవరి 9న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇందులో ఎన్టీఆర్ ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా డెఫినెట్గా మ్యూజికల్ హిట్టవుతుంది. ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కెరీర్లలోనూ, మా బేనర్లోనూ ఇది ప్రతిష్ఠాత్మక చిత్రంగా తయారవుతోంది'' అని చెప్పారు.
ఎన్టీఆర్ హీరోగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓ చిత్రం రూపొందుతోంది. కాజల్ హీరోయిన్ . పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. తొలి షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల పూర్తయింది.
ఈ చిత్రంలో ప్రకాశ్రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ, వెన్నెల కిశోర్, జయప్రకాశ్రెడ్డి, సప్తగిరి, కోవై పరళ, రమాప్రభ, పవిత్రా లోకేశ్ తారాగణం. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల.