Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలయ్య 100వ సినిమా కోసం అన్నీ వదిలేసి దర్శకుడు!
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ కొన్ని రోజులుగా ‘రుద్రాక్ష' పేరుతో హారర్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం జూన్ నెలలో సెట్స్ మీదకు రావాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి బాలయ్య 100వ సినిమా చేసే అవకాశం రావడంతోకృష్ణ వంశీ తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ‘రుద్రాక్ష' చేయడం కంటే బాలయ్య 100వ సినిమానే ముఖ్యమని భావిస్తున్న ఆయన....రుద్రాక్ష పనులను వాయిదా వేసుకున్నారు. బాలయ్య సినిమాకు సంబంధించిన పనుల్లో పూర్తిగా నిమగ్నమయినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడనుంది.
చాలా కాలం నుండి బాలయ్యతో పని చేయాలని కృష్ణ వంశీ ఎదురు చూస్తున్నారు. బాలయ్య కోసం చాలా కాలం క్రితమే స్క్రిప్టు కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. గత నెలలో బాలయ్యను కలిసి కథ వినిపించాడు. బాలయ్యకు కథ నచ్చడంతో వెంటనే దాన్నే 100వ సినిమాగా చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మే నెలలో కృష్ణ వంశీ దర్శకత్వంలో బాలయ్య 100వ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
గతంలో బాలయ్య 100వ సినిమా బోయపాటి దర్శకత్వంలో ఉంటుందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘ఆదిత్య 369' సీక్వెల్ గా ‘ఆదిత్య 999' చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. పలు కారణాలతో ఆ రెండు ప్రాజెక్టులను బాలయ్య పక్కన పెట్టేసారు. ఇపుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో చేసే ఆలోచన దిశగా ముందుకు సాగుతున్నారు. మరి ఈ ప్రాజెక్టు అయినా కార్యరూపం దాలుస్తుందా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి.