Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
బంధువు కావడంతో మహేష్ బాబు ఒప్పుకున్నాడా?
ఈ చిత్రానికి క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసోసియేట్ దర్శకుడిగా పని చేసిన రామ్ప్రసాద్ ఈ సినిమాకి దర్శకుడిగా పరిచయం కానున్నాడట. ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్పై చంటి అడ్డాల ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం గురించి ప్రకటించారు చంటి అడ్డాల. 'నా గత చిత్రం అల్లరి నరేష్ హీరోగా నిర్మించిన 'యముడికి మొగుడు' తరువాత చేయబోయే చిత్రం కన్ఫర్మ్ అయ్యింది.
ఇదొక ట్రయాంగిల్ లవ్స్టోరీ. చిత్రం యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతోంది. అన్ని పాటలూ ప్రముఖ కొరియోగ్రాఫర్ వైభవీ మర్చంట్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరించనున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రారంభోత్సవం రేపు(ఆగస్టు 7)న హైదరాబాద్ లో జరుగుతుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబును చీఫ్ గెస్టుగా ఆహ్వానించినట్లు సమాచారం. తన బంధువు కావడంతో మహేష్ బాబు వెంటనే ఒకే చెప్పినట్లు ఫిల్మ్ నగర్ టాక్.
ప్రస్తుతం మహేష్ బాబు 'ఆగడు' చిత్రం క్లైమాక్స్ షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఆగడు చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.