Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
80 కోట్ల బడ్జెట్ తో మహేష్ నెక్ట్స్ ఖరారు ..పూర్తి డిటేల్స్
హైదరాబాద్ : ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏమిటీ అంటే మహేష్, మురగదాస్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ కొద్ది రోజుల క్రితమే సెట్ అయ్యిందని సమాచారం. ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ ఈ ప్రాజెక్టుని సెట్ చేసారని సమాచారం. మహేష్ బాబుకు నిర్మాత ఎన్.వి ప్రసాద్ తో చిత్రం కమిట్ మెంట్ ఉంది. అలాగే మురుగదాస్ కు ఠాగూర్ మధు తో సినిమా చెయ్యాలని ఎగ్రిమెంట్ ఉంది. ఈ రెండూ కలిసి వచ్చేలా ఈ ప్రాజెక్టుని ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది.
ఇక ఈ ప్రాజెక్టుకు 80 కోట్లు ఖర్చుపెట్టడానికి వీరు సిద్దమైనట్లు సమచాారం. ఇది మహేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం. విజువల్ గ్రాఫిక్స్ కు ఈ సినిమాలో ప్రయారిటీ లేదు కానీ భారీగా ,రిచ్ గా ఉండాలని మురుగదాస్ నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం మహేష్ చేస్తున్న బ్రహ్మోత్సవం అనంతరం ఈ చిత్రం ఉండబోతోందని చెప్తున్నారు. మరి మురగదాస్ ఈ ప్రాజెక్టుతో ఏం సంచనలం సృష్టించనున్నారో చూడాలి.
మహేష్ తాజా చిత్తరం 'బ్రహ్మోత్సవం' విషయానికి వస్తే...
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్బాబు హీరోగా నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రీకరణ రామోజీ ఫిల్మ్సిటీలో బుధవారం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. రాజు సుందరం మాస్టర్ నేతృత్వంలో సంగీత్ పాటను మహేష్బాబు, ప్రణీత, నరేష్, రావు రమేష్, జయసుధ, తులసి... ఇలా 21 మంది నటులపై తెరకెక్కిస్తున్నారు.
అక్కడ అంతా ఒకటే సందడిగా ఉంది. ఇల్లంతా పూలసోయగాలతో పరిమళిస్తోంది. లంగా ఓణీలు కట్టిన పడుచులతో మెరిసిపోతోంది. ముత్తయిదువులు పట్టుచీరలు కట్టుకుని చేసే హడావిడికి లెక్కే లేదు. మరో పక్క సంగీతం జోరుగా వినిపిస్తోంది. కుటుంబం, బంధువులు...ఇలా అందరూ కలిసి సరదాగా ఓ పాటేసుకుంటున్నారు. వాళ్లతో కలిసి మహేష్బాబు స్టెప్పులేస్తున్నాడు. ఎందుకంటే 'బ్రహ్మోత్సవం' కోసం.
మహేష్బాబు మాట్లాడుతూ ''శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథ బాగా నచ్చింది. 'శ్రీమంతుడు' తర్వాత ఇంత మంచి కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు నా అభిమానుల్ని అలరించే చక్కటి కుటుంబ కథా చిత్రమవుతుంద''న్నారు.
''సంగీత్ సాంగ్తో పెద్ద ఎత్తున చిత్రీకరణ మొదలుపెట్టాం. ఈ వేడుకలు ఇలానే కొనసాగుతాయి''అన్నారు దర్శకుడు.
నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ వి. పొట్లూరి మాట్లాడుతూ ''తిరుమల బ్రహ్మోత్సవాలు మొదలైన రోజునే మా చిత్రం ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. తోట తరణి వేసిన భారీ సెట్లో ఈ పాటను తెరకెక్కిస్తున్నాం. వేసవి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు, కూర్పు: శ్రీకర ప్రసాద్, సంగీతం: మిక్కీ.జె. మేయర్