Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కొరటాల శివకు మహేష్ బాబు షాక్
హైదరాబాద్ : రచయిత నుంచి దర్శకుడు గా మారిన కొరటాల శివ ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నాడు. ఇన్నాళ్లూ రచయిత సీట్ లో కూర్చుని కథలు చెప్పి ఒప్పించిన ఆయన ఇప్పుడు హీరోలతో ఇబ్బంది పడుతున్నాడని పిల్మ్ నగర్ టాక్. మిర్చి చిత్రంతో ఘన విజయం సాధించినా ఆయన చిత్రం ఏదీ మొదలుకాలేదు. ఆయన వద్ద ఫుల్ బైండ్ స్క్రిప్టు ఉన్నా..హీరోల డేట్స్ సంపాదించటం గగనమైతోందని వాపోతున్నట్లు చెప్పుకుంటున్నారు. రామ్ చరణ్ తో మొదట ప్రాజెక్టుని అనుకున్నా అది టర్న్ తిరిగి కృష్ణ వంశీ చేతికి వెళ్లింది.
దాంతో కొరటాల శివ ...ఈ సారి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లారు. అయితే అక్కడ ఎన్టీఆర్ చెప్పిన మార్పులే చేయకపోవటంతో ఆయన కోప్పడినట్లు సమాచారం. అయితే ఈ లోగా మహేష్ కథ వినటాననటంతో అటు అడుగు వేసారు. అగడు చిత్రం తర్వాత ఈ ప్రాజెక్టు ఉంటుందనుకున్నారు. కొరటాల శివ దానిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ మహేష్ నుంచి షాక్ కొట్టే వార్త వచ్చిందని సమాచారం.
మహేష్ బాబు ఇప్పుడు మిగతా ప్రాజెక్టులు అన్నీ ప్రక్కన పెట్టి అశ్వనీదత్ తో ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఆయన బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డికె ల స్క్రిప్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగడు తర్వాత ఇమ్మీడియట్ గా ఆ చిత్రమే మొదలవుతుంది. దాంతో కొరటాల శివ దాదాపు సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సిన పరిస్ధితి . సంవత్సరంలో ఎన్ని లెక్కలు మారి..ఏం జరుగుతుందో అని ఇండస్ట్రి వర్గాలు అంటున్నాయి.